Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

No Passport Airport: పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ అవసరం లేని విమానాశ్రయం ఇదే

No Passport Airport: ప్రస్తుత రోజులలో కూడా ఎయిర్‌పోర్ట్‌లో (AIRPORT) ఫ్లైట్ ఎక్కే ముందు ప్రయాణికులు ఒకసారి కాదు చాలా సార్లు చెక్ చేసే ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. ప్రయాణం అంతర్జాతీయంగా ఉంటే ఈ ప్రక్రియ చాలా పొడవుగా, ప్రాసెస్‌ (PROCESS) ఎక్కువ కూడా ఉంటుంది. అయితే త్వరలోనే ప్రయాణికులు ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందనున్నారు. అది ఏమిటంటే అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులు పాస్‌పోర్ట్, ఐడీ చూపకుండానే చెక్-ఇన్, బోర్డింగ్ (Check-in, boarding)లాంటి సౌకర్యాలను త్వరలో అమలు అవ్వబోతున్నాయి.

ఇక సీఎన్‌ఎన్‌ నివేదిక ప్రకారం, అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Zayed International Airport) అతి త్వరలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. దీనితో ప్రజల అంతర్జాతీయ ప్రయాణ అనుభవం పూర్తిగా మార్పులు రాబోతున్నాయి. ఇన్నోవేటివ్ స్మార్ట్ ట్రావెల్ ప్రాజెక్ట్ (Innovative Smart Travel Project) కింద 2025 నాటికి ఈ పాస్‌పోర్ట్‌ను ఆధునిక సాంకేతికతతో సన్నద్ధం చేయాలని, ప్రతి ప్రవేశం, నిష్క్రమణ వద్ద బయోమెట్రిక్ సెన్సార్‌లను ఇన్‌స్టాల్ చేయాలనే ప్రణాళిక కూడా ఉన్నట్టు సమాచారం. దీని వల్ల ఎక్కడికైనా వెళ్లి వచ్చే ప్రక్రియ వేగంగా సురక్షితంగా, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఇక ఈ విషయాల గురించి సమాచారం ఇస్తూ జైదా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆండ్రూ మర్ఫీ మాట్లాడుతూ.. ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా బయోమెట్రిక్ సెన్సార్‌ను రూపొందించినట్లు తెలియ చేసారు. ఇలాంటి పరిస్థితిలో ప్రయాణీకులు విమానాశ్రయం ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల గుండా వెళుతున్నప్పుడల్లా అది స్వయంచాలకంగా ప్రయాణికుల గుర్తింపును ప్రమాణీకరిస్తుంది. ఈ పని అతి తక్కవ టైంలోనే పూర్తవుతుంది. ఇది విమానాశ్రయంలో పట్టే సమయాన్ని కూడా తగ్గిస్తుంది అన్నట్టు సమాచారం.

ఈ పరిస్థితిలో ప్రయాణికులు 15 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో గేటుకు చేరుకుంటారు. ఇప్పటికే విమానాశ్రయంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు ఆండ్రూ మర్ఫీ అన్నారు. అంతే కాకుండా ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ విమానాలు ఇప్పటికే దీనిని ఉపయోగిస్తున్నాయి.