NTR: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొం డ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కా ర్యాలయంలో టీడీపీ వ్యవస్థాప కులు కీ. శే. శ్రీ నందమూరి తారక రామారావు102వ జయంతి కార్య క్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్ర ధానకార్యదర్శి తుమ్మల మధుసూ దన్ రెడ్డి హాజరైనారు. ఈ సంద ర్భంగా తుమ్మల మధుసూదన్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గ ఇంచార్జి ఎల్ వి యాదవ్ లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయినప్పటికీ NTR ఆశయాలను, సిద్ధాంతాలను ఇప్పు డు ఉన్న ప్రభుత్వాలు కూడా పాటి స్తున్నాయని గుర్తు చేశారు.
ఆనా డు ఎన్టీఆర్ దేశంలో తెలుగు వారి ఔన్నత్యాన్ని కాపాడి దశ దిశలా తె లుగు వారి కీర్తి ప్రతిష్టలను చాటి చె ప్పారని అన్నారు. బడుగు బలహీ న వర్గాల వారికీ రాజకీయ రిజర్వేష న్లు కల్పించి సామజిక న్యాయం కో సం కృషిచేశారని అన్నారు. వితం తు, వృధాప్య పింఛన్లు, కూడు, గూ డు, గుడ్డ వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ము ఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి పటే ల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి మండల వ్యవస్థను స్థాపించి సాధా రణ ప్రజలందరికీ పాలనా సౌలభ్యం కల్పించడం జరిగిందన్నారు. మహి ళలకు ఆస్థి హక్కు కల్పించిన ఘన త ఎన్టీఆర్ దే అన్నారు. నారా చం ద్రబాబు నాయుడు నాయకత్వం లో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఆశ యాలను ముందుకు తీసుకెళ్లడం లో యూవతను అభివృద్ధి పథంలో నడిపెందేకు సామజిక న్యాయం పా టించేందుకు నిరంతరం కృషిచేస్తు న్నారన్నారు. ప్రతి తెలుగుదేశం కా ర్యకర్త తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అనే నినాదంతో బయటికి రావాలని ప్రతి కార్యకర్తకు తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో నాయ కులు కూరెళ్ల విజయ్ కుమార్, ఆకు నూరి సత్యనారాయణ, గుండు వెం కటేశ్వర్లు, జంపాల చంద్రశేఖర్, బ క్కతోళ్ళ ఇస్తారి, రఫీక్, సిద్ధిక్, తేలు అన్న రవి, ఆరేళ్ళ కొండలు, గంగా ధర స్వరాజ్ తదితరులు పాల్గొ న్నారు.