Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Odisha: :ఆ తెగ నుంచే తొలి డాక్టర్‌

–డాక్టర్ సీటు సాధించిన ఆదివాసీ బిడ్డ

ప్రజా దీవెన ఒరిస్సా: సాధారణంగానే ఎంబిబిఎస్ సీట్ (MBBS seat) సాధన అంతా ఆషామాషీ కాదు అనేది అందరికీ తెలిసిందే. అటువంటి కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఓ ఆదివాసి బిడ్డ చేదించింది. ఎం తో కష్టతరమైన నేషనల్ ఎలిజిబిలి టీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్ష లో అర్హత సాధించి, మంచి కాలేజీ లో సీటు ఆదివాసి బిడ్డ సాధించడం పట్ల సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. వివరాల్లోకి వెళితేఒరిస్సా లోని (Odisha)బోండా తెగకు చెందిన మంగళ ముదులి(19) ప్రతిష్టాత్మ కమైన మెడికల్ ప్రవేశపరీక్షలో ఉత్తీ ర్ణత సాధించాడు. బరంపురం (బెర్హంపూర్‌)లోని మహారాజ కృష్ణ చంద్ర గజపతి (MKCG) మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందాడు. అంతేకాదు ఆ తెగ నుంచి డాక్టర్‌ కాబోతున్న మొదటి వ్యక్తిగా నిలిచాడు. మంగళ ముదులి కుటుంబం చిన్నతరహా అటవీ ఉత్పత్తుల ను అమ్ముకుంటూ జీవిస్తోంది. అతడికి ముగ్గురు తోబుట్టువులు. వారి కుటుంబంలో మొదట ఉన్నత విద్యను అభ్యసించింది తానే అని ముదులి పేర్కొన్నాడు. స్థానిక రెసిడెన్షియల్ స్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేశానని, రోజూ ఐదు కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్‌ (Trekking) చేస్తూ ఆ స్కూల్‌కు వెళ్లేవాడినని వివరించాడు. అనంతరం ఇంటర్‌ చదవడానికి తమ గ్రామం నుంచి 25 కి.మీ. వెళ్తూ, ఏకకాలంలో నీట్‌ కోచింగ్‌ తీసుకునేవాడినని తెలిపాడు.

కోచింగ్‌ కోసం అతడి స్కూల్‌ (schoool)టీచర్‌ శోభన్ బాబు ఆర్థిక సాయం చేశార ని తెలిపాడు.తమ గూడెంలోని (Goodem)ప్రజలకు సరైన వైద్య సదుపాయా లు అందక పోవడంతో ఎన్నో ఇబ్బం దులును ఎదుర్కొంటు న్నారని, ప్రజలు సొంతంగా మూలికా వైద్యం చేసుకోవడంతో ఒక్కోసారి అది వికటించి ప్రాణాలు కోల్పోతున్నా రని ఆవేదన వ్యక్తం చేశాడు. తన జాతి ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడం కోసం తాను డాక్టర్‌ను కావాలనుకుం టున్నానని తెలిపాడు.