Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Om Birla: ఓం బిర్లాపై మోదీ ప్రశంసల జల్లు

Om Birla:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా భాజపా ఎంపీ ఓం బిర్లా (Om Birla) వరుసగా రెండోసారి ఎన్నికయ్యా రు. బుధవారం జరిగిన ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై (SURESH) ఆయన విజ యం సాధించా రు. ఈ సందర్భంగా ఓం బిర్లాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (MODI) శుభా కాంక్షలు తెలియ జేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవే ర్చేందుకు స్పీకర్‌గా ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశా రు. స్పీక‌ర్ స్థానంలో (In place of the speaker ఓం బిర్లా ను కూర్చొబెట్టిన అనంత‌రం మోదీ స‌భ‌లో మాట్లాడుతూ బిర్లాపై ప్రశం సలు కురిపించారు. సభ ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉం డేలా చూడడంలో బిర్లా ముఖ్య మైన పాత్ర పోషిస్తారని పేర్కొ న్నా రు. రాబోయే ఐదేళ్ల పాటు మీ మార్గ దర్శకత్వం కోసం ఎదురు చూస్తు న్నానని తెలిపారు. మీ మధురమైన చిరునవ్వు సభ మొత్తాన్ని సంతో షంగా ఉంచుతుం దని ప్రశంసల జల్లు కురిపించారు. మీరు రెండ వసారి స్పీకర్ పదవికి ఎన్నిక కావ డం గౌరవప్రదమైన విషయం అని బిర్లాను (BIRLA) అభినందించారు. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో జరగని పను లు మీ అధ్యక్షతన ఈ సభ వల్లే సాధ్య మయ్యాయని ప్రధాని అన్నారు. కీలక బిల్లులు మీ నాయ కత్వంలో ఆమోదం పొందాయని, ప్రజాస్వా మ్య సుదీర్ఘ ప్రయాణంలో అనేక మైలురాళ్లు వచ్చాయని తెలిపారు. 17వ లోక్‌ సభ సాధించిన విజ యాల గురించి దేశం గర్విస్తుందని తనకు చాలా నమ్మకం ఉందని మోదీ పేర్కొన్నారు.