Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Miss World controversy : మిస్ వరల్డ్ పోటీలపై ప్ర‌తిప‌క్షాలవి అభూత‌న క‌ల్ప‌న‌లు, అవాస్తవాలు

–మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు రూ. 30 కోట్లు కాగా రూ. 21 కోట్లు స్పా న్స‌ర్ల ద్వారానే వ‌చ్చాయి

–రూ. 200 కోట్లు ఖ‌ర్చు అంటున్న బిఆర్ఎస్ ఎక్క‌డ ఖ‌ర్చు అయ్యా యో చెప్పాలి
–చ‌ర్చ‌కు సిద్ద‌మా అంటూ స‌వాల్
నిరూపించ‌క‌పోతే ముక్కు నేల‌కు రాయాలి
–మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆ రోప‌ణ‌లు కూడా అవాస్తవాలు
–మంత్రి పొన్నంతో కలిసి ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

Miss World controversy : ప్రజా దీవెన హైదరాబాద్: మిస్ వ‌ర‌ ల్డ్ పోటీల నిర్వ‌హ‌ణ‌కు సుమారు రూ. 30 కోట్ల ఖ‌ర్చు అయింద‌ని, వీ టి ద్వారా తెలంగాణ గొప్ప తనా న్ని ప్ర‌పంచానికి చాటి చెప్పామ‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మం త్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. మంగ‌ళ‌వారం డా. బీఆర్. అం బే డ్క‌ర్ స‌చివాల‌యంలో ర‌వాణా శా ఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తో క‌లి సి మంత్రి జూప‌ల్లి మీడియాతో మా ట్లాడారు.

హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప ర్యాటక ప్రమోషన్ , సం స్కృతి సం ప్రదాయాలు ప్రతిబింబించడమే ల క్ష్యంగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం అ య్యాయని, మిస్ వరల్డ్ ఈవెంట్‌ ను అపూర్వ విజయంగా నిలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తె లియజేశారు. ప‌ర్యాట‌కం, హ‌స్త‌క‌ ళ‌లు, చేనేత ఉత్పత్తులకు మంచి ప్రమోషన్ వచ్చిందని, మ‌న సం స్కృతి, సాంప్ర‌దాయాలు, ఆహా ర‌పు అల‌వాట్లను ప్ర‌పంచానికి ప‌రి చ‌యం చేశామ‌ని, ఆ వేడుక‌ల నిర్వ‌ హ‌ణ‌, ఆతిధ్యం ప‌ట్ల కంటెస్టెంట్లు, మిస్ వ‌రల్డ్ సంస్థ ప్ర‌తినిధులు, మీ డియా ప్ర‌తినిధులు సైతం ఆనందం వ్య‌క్తం చేశార‌ని చెప్పారు.

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై రా ష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అభి నందించాల్సి పోయి విమర్శలు చే స్తున్నాయ‌ని మండిప‌డ్డారు. మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చయింది రూ.3 0 కోట్లని, స్పాన్సర్ల ద్వారానే రూ.2 1 కోట్లు వచ్చాయని, రాష్ట్ర ప్రభు త్వానికి అయిన ఖర్చు రూ.9 కోట్లు మాత్రమేన‌ని స్ప‌ష్టం చేశారు. మరో 10 నుంచి 11 కోట్ల ఆదాయంపై ఒ ప్పందాలు ఉన్నాయని వివ‌రించా రు.

ఈ పోటీలపై కొందరు తప్పుడు ప్ర చారం చేశారని, గొప్పగా కార్యక్ర మం నిర్వహిస్తే పలుచన చేయాలని చూశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విపక్షాల విమర్శలు చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కో ట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చె ప్పాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ కు రావాలా, అ బిడ్స్ చౌరస్తాకు రావాలా రూ.200 కోట్లు ఖర్చు అయినట్లు నిరూపించ కుంటే ముక్కు నేలకు రాయాలని మంత్రి డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ పాలనలో టూరిజం ప్రమోషన్లకే రూ.115 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలిపారు. ఇంత పెద్ద ఈవెంట్ ను త‌క్కు ఖ‌ర్చుతో ఘ‌నంగా నిర్వ‌హించామ‌ని పేర్కొ న్నారు. సొంత పత్రికలు, మీడియా, సోష‌ల్ మీడియాలో అస‌త్యాలు ప్ర‌ చారం చేశార‌ని, అందగత్తెల కాళ్లు కడిగారని విష ప్రచారం చేశారని మండిప‌డ్డారు. ఐఏఎస్ అధికారుల తో కాళ్లు మొక్కించుకున్నఘనత కేసీఆర్ దేన‌ని అన్నారు. కంటెస్టెంట్ల కు 30 తులాల బంగారం ఇచ్చార నేది పచ్చి అబద్ధమని, చౌమ‌హ‌ల్లా ప్యాలెస్ విందులో ఒక్కో ప్లేట్ భో జ‌నానికి ల‌క్ష రూపాయాలు ఖ‌ర్చు చేశార‌నేది అవాస్త‌మ‌ని ఒక్కో ప్లేట్ కు అయిన ఖ‌ర్చు రూ. 8,200 మా త్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

తనపట్ల మిస్ బిహేవ్ చేశారని మి స్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలను మంత్రి జూప‌ల్లి ఖం డించారు. ఆమె ఆరోపణల్లో వా స్తవం లేదన్నారు. దీనిపై కొందరు బీ ఆర్ఎస్ నాయకులు కావాలనే దు ష్ప్రచారం చేస్తున్నారని, అవ‌న్ని అభూత‌క క‌ల్ప‌న‌లేన‌ని చెప్పారు. మిస్ ఇంగ్లాండ్ ను ఇబ్బంది పెట్టా రనేది వాస్తవం అయితే మిగతా 108 మంది పోటీదారులు చివరి వరకు ఉండేవారు కాదన్నారు. మి స్ వరల్డ్ పోటీదారులకు వచ్చిన వా ళ్లు చివరిదాకా చాలా హ్యాపీగా ఉ న్నారని చెప్పారు. ఏమీ జరగని దా నికి ఏదో జరిగినట్టు ప్రచారం చేస్తు న్నారని మండిపడ్డారు.

వాళ్లను ఇబ్బంది పెడితే మళ్లీ మళ్లీ తెలంగాణకు రావాలని ఉందని ఎం దుకు చెబుతారని ప్రశ్నించారు. మి స్ వరల్డ్ విన్నర్ గా గెలిచిన థాయి లాండ్ సుందరి ఓపల్ సుచాతకు తెలంగాణ ఆథిత్యం, ఇక్కడి పర్యా టక ప్రాంతాలు నచ్చాయని చెప్పా రు. తన జీవితంలో హైదరాబాద్ ను మరువ, అవకాశం వస్తే మళ్లీ ఇక్కడికి వస్తానని ఓపల్ సుచాత చెప్పారన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడు తూ మిస్ వ‌ర‌ల్డ్ పోటీలను ప్ర‌భు త్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని విజ‌య‌వంతంగా నిర్వ‌ హించ‌డాన్ని చూసి ప్ర‌తిప‌క్షాలు ఓర్వ‌లేక‌పోతున్నాయ‌ని మండిప‌ డ్డారు.ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు అన‌వ‌స‌ర విష‌యాల‌ను లేవ‌నెత్తు తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌కీయ ల‌బ్ది కోసం అస‌త్యాల‌ను ప్ర‌చారం చేయ‌డం త‌గద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నాగ‌ర్ క‌ర్నూల్ ఎ మ్మెల్యే రాజేష్ రెడ్డి, ప‌ర్యాట‌క శాఖ డైరెక్ట‌ర్ హ‌న్మంతు జండ‌గే, స్టేట్ ఆ ర్ట్ గ్యాల‌రీ డైరెక్ట‌ర్ కె.ల‌క్ష్మి పాల్గొ న్నారు.