Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Paladugu Nagarjuna: పూలే అంబేద్కర్ జన జాతర సభజయప్రదం చేయాలి

–కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున

Paladugu Nagarjuna: ప్రజాదీవెన నల్గొండ : భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అణిచివేత ఆధిపత్యం పై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని, ఏప్రిల్ 28 న సాయంత్రం 4గంటలకు నల్గొండ లోని పెద్ద గడియారం సెంటర్ లో జరుగు పూలే అంబేద్కర్ జన జాతర సభలు నిర్వహించటంతో పాటు కుల వివక్ష పై ప్రత్యక్ష ప్రతిఘటన ఉద్యమాలు చేపట్టాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, చోళ్ళేటి ప్రభాకర్, దుడుకు లష్మినారాయణ, బర్రె సుదర్శన్, కత్తుల షణ్ముఖ పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ జిల్లా
కేంద్రoలోని పెద్ద గడియారం సెంటర్ లో కేవీపి ఎస్, సామాజిక ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు పాల్గొని పూలె అంబేద్కర్ జన జాతర సభ పోస్టర్, కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూకుల వివక్ష ఆదిపత్యానికి వ్యతిరేకంగా కెవిపిఎస్ గత కొన్ని సంవత్సరాలుగా పూలే అంబేద్కర్ జన జాతర సభలు నిర్వహిస్తుందన్నారు. మను ధర్మశాస్త్రం పేరుతో వేల సంవత్సరాలుగా దేశంలో మెజారిటీ ప్రజలను అణిచివేశారని చెప్పారు. నేడు ఆ భావజాలంతో దేశాన్ని ఏలుతున్న మనువాద పాలకులు వారి విధానాలు హిందూ మతంలోని మెజారిటీ ప్రజలను అణిచివేయటానికి అవమానించటానికి ఉపయోగపడుతున్నాయన్నారు. ధరలు పెంచడం నిరుద్యోగాన్ని పెంచడం ఆర్థిక అసమానతలు పెంచడం వంటి దుష్ట విధానాలను ప్రజలకు అర్థం కాకుండా నిత్యం మతం మత్తులో ముంచుతుందని వారు విమర్శించారు. దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా దళిత గిరిజనుల ఉపాధి ఎలా మెరుగుపడుతుందని ప్రశ్నించారు.

దేశంలో దళితులపై 300 రెట్లు దౌర్జన్యాలు పెరిగాయన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నేతలు వారి మనువాద దుష్ట విధానాలతో దేశాన్ని పరిపాలిస్తు రాజ్యాంగాన్ని తొలగించాలని చూస్తున్నారని విమర్శించారు. పూలే, అంబేద్కర్ ఆశయాలకు తిలోదకాలు ఇస్తూ దేశంలో క్యాపిటలిస్టుల ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని ఆరోపించారు. జ్యోతిబాపూలే అంబేద్కర్ ఆశయాలను నేటి తరంలోకి విస్తృతంగా తీసుకెళ్లే క్రమంలో రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను ప్రభుత్వ రంగ సంస్థలను సామాజిక న్యాయాన్ని సాధించడానికి పూలే, అంబేద్కర్ జన జాతర సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో కులవివక్ష అంటరానితనం ఎక్కడ ఉన్న ప్రతిఘటించి పోరాడుదామని అన్నారు. ప్రజలు పౌర సమాజం కుల వివక్షను పారద్రోలాలని జిల్లాలో కులవివక్షపై ప్రత్యక్షంగా ప్రతిఘటన చేపడుతామని చెప్పారు. 28న సాయంత్రం 4 గంటలకు పెద్ద గడియారం సెంటర్ లో జరిగే జన జాతరలో ప్రొఫెసర్ చింతకింది కాశీం, మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి, బహుజన యుద్దానౌక ఏపూరి సోమన్న, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పేట్ల స్కైలాబ్ బాబు తెలుగు అధ్యాపకురాలు అనిత, సామజిక ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.

కళాకారులచే అట, పాట, మాట కార్యక్రమాలు, డప్పు లు కోలాటం ఇతర సంస్కృత కార్యక్రమం లు వుంటాయని అన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు, పుర ప్రముఖులు, కవులు, కళాకారులూ, మేధావులు, మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ పోస్టర్ కరపత్రల ఆవిష్కరణ లోబకరం శ్రీనివాస్, పందులసైదులు, కత్తుల జగన్, వడ్డే బోయిన సైదులు, గాదె లింగస్వామి, రాయల సీతారాములు, ఐతాగొని జనార్దన్ గౌడ్, కర్నాటి యాదగిరి, పాలడుగు ప్రభావతి, కొండా అనురాధ, నాగుల జ్యోతి, భూతం అరుణ, మంజుల, స్వేరో పాండు, పుట్ట వెంకన్న, పెరిక అంజయ్య, దండంపల్లి సత్తయ్య, అవుతా రవీందర్, కందుల అశోక్, మన్నెం శ్రీను, సుంకిశాల వెంకన్న, పాలడుగు అంజిబాబు, కాటేపక శంకర్, కత్తుల మహేశ్వర్ కత్తుల సన్నీ, ఇరిగి ప్రసాద్, బొజ్జ దేవయ్య, బొజ్జ నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.