–ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి డిమాండ్
Paladugu Prabhavati: ప్రజా దీవెన, కనగల్: నిత్యం నిరు పేదలు కనగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని తీవ్రమైన మందుల ఉందని వెంటనే అవసరమైన మం దులు సరఫరా చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి (Paladugu Prabhavati) డిమాండ్ (demand) చేశారు. ఈరోజు సంఘం ఆధ్వర్యంలో పీహెచ్సీలో సమగ్ర సర్వే నిర్వహించడం జరిగింది. కనగల్లు హాస్పిటల్ లో (Kanagallu Hospital) ఈరోజు ఐద్వ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన వసతులు (facilities) లేవు. సిబ్బంది తక్కువగా ఉన్నారని రోజుకు 70 మంది ఓపి చూస్తున్నప్పిటికి అన్ని రోగాలకు సంబంధించిన మందులు లేవని అన్నారు. బాత్రూంల సమస్య ఉంది. స్టాప్ కొరత ఉంది. నైటు వాచ్మెన్ లేడు. స్వీపర్ లేరు. పర్మెంటు వాళ్లను కేటాయించాలి. వాళ్లను పర్మిట్ చేయాలి. ఈ పిహెచ్సి హాస్పిటల్ (PHC Hospital)లో చుట్టూ ఉన్న గ్రామాలకు సంబంధించి గర్భిణీ స్త్రీలు జిల్లా హెడ్ క్వార్టర్ కు (Head Quarters) పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి 9 సబ్ సెంటర్లకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ కి రావడానికి ఒక అంబులెన్స్ ను కేటాయించాలి. అదే రకంగా ఇక్కడ డెలివరీలు చేయాలన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా ఈ ఆసుపత్రిలోనే (hospital)చేయాలని కోరారు .ఈ సదుపాయాలన్నీ కూడా అధికారులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి ఎస్కె సుల్తానా, లలిత, సునీత, మంజుల, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.