Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pawan Kalyan: కర్ణాటక సిఎంతో ఏపి డిప్యూటీ సీఎం భేటీ

–పవన్ కళ్యాణ్ ను అప్యాయంగా ప‌ల‌క‌రించిన సిద్ద‌రామ‌య్య‌
–రాజ‌కీయాల‌పై మాటామంతి ఏనుగుల బెడ‌ద‌పై ప‌వ‌న్ చ‌ర్చ‌లు
–కుంకీ ఏనుగులను ఎపికి పంపాల‌ ని అభ్య‌ర్ధ‌న

Pawan Kalyan:ప్రజా దీవెన, బెంగ‌ళూరు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో (Siddaramaiah)బెంగళూరులో గురువారం సమావేశమయ్యారు. ఎపిలోని పార్వ‌తీపురం, చిత్తూరు జిల్లాలో గ్రామాల‌లోకి ప్ర‌వేశిస్తున్న చొర‌బ‌డు తున్న ఏనుగులను ఆరిక‌ట్టే చ‌ర్య‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్ ఆ రాష్ట్ర అట‌వీ శాఖ మంత్రితో చ‌ర్చ‌ల కోసం అమ‌రావ‌తి నుంచి బెంగుళూరు వెళ్లారు. ముందుగా ప‌వ‌న్ ముఖ్య‌ మంత్రి సిద్ద‌రామయ్య నివాసానికి వెళ్లి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశా రు. అక్క‌డికి చేరుకున్న ప‌వ‌న్ ను ఆప్యాయంగా లొనికి ఆహ్వ‌నించా రు సిద్ద‌రామ‌య్య‌, ఇరువురు కొంత సేపు రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం ఏనుగులు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు ప‌వ‌న్, దీనిపై అట‌వీ శాఖ మంత్రి ఈశ్వర్ బీ ఖంద్రేతో చ‌ర్చించ‌ల‌సిందిగా కోరారు. అనం త‌రం ప‌వ‌న్ మంత్రి ఈశ్వ‌ర్ తో భేటి అయ్యారు.

చిత్తూరు జిల్లా పరిధి లో పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు గ్రామాల్లోకి వస్తూ పంటలు నాశనం (Crops are destroyed) చేస్తున్నాయ‌ని, అలా గే స్థానికులకు ఏనుగులు ప్రాణ హా ని కలిగిస్తున్నాయి మంత్రి దృష్టికి తెచ్చారు. ఆ ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమవుతాయ‌ న్నారు. కర్ణాటకలో కుంకీ ఏనుగులు ఉండడంతో కొన్నింటిని త‌మ‌ రా ష్ట్రానికి పంపాల‌ని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని పవన్ కల్యాణ్ (
Pawan Kalyan)కోరారు. కుంకి ఏనుగుల మనుగడ తో పాటు వాటి జీవన విధానంలో మార్పుపై పవన్ కూడా ఆయ‌న‌తో చ‌ర్చించారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వ యంతో పని చేసేలా కార్యాచరణ రూపొందించుకునే అంశంపై కూడా పవన్ కల్యాణ్ సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రి పారు. ఇరు రాష్ట్రాలు అక్ర‌మ ర‌వా ణ వివ‌రాల‌ను, వాటిని స్మ‌గ్లింగ్ చేసే వారి స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చు కోవాల‌ని నిర్ణ‌యించారు.