Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pawan Kalyan: సమర్థుల కోసం ఆరా

–ఏపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఆరా కసరత్తు
— కృష్ణతేజను ఓఎస్టీగా తీసు కుంటారన ప్రచారం
Pawan Kalyan: ప్రజా దీవెన,అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా (deputy CM) బాధ్యతలు చేపట్టారు. అధికారులతో సమీక్షించిన పవన్, ఇప్పుడు ఆయన తన టీమ్ ను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి (ias) కృష్ణతేజను డిప్యూటేషన్ పై ఏపీకి రప్పించి ఆయనను ఓఎస్టీగా నియమిం చుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కృష్ణతేజ ఇప్పటికే పవన్ ను కలిశారు. చంద్రబాబు కూడా కృష్ణతేజ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పరంగా ఆయనను ఏపీకి డిప్యూటేషన్ పై తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐఏఎస్ అధికారి కృష్ణతేజ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)వీరాభిమాని. గత వారం కృష్ణతేజను జాతీయ బాలల హక్కుల ( world child right)రక్షణ కమిషన్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా పవన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. బాలల హక్కుల రక్షణలో త్రిస్సూర్ జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దీని వెనుక జిల్లా కలెక్టర్ కృష్ణతేజ కృషి ఎంతో ఉ ంది. త్వరలోనే ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణతేజ ( krishana Teja)కేరళ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తూ ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని పవన్ భావిస్తున్నారు.
కృష్ణతేజ విధి నిర్వహణలో చూపిన అంకిత భావాన్ని పవన్( Pawan Kalyan)ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఆయన తన విధినిర్వహణలో ప్రజలకు మరింతగా సేవలు అందిస్తూ ఉద్యోగులకు, య- వతకు స్ఫూర్తి నిస్తున్నాయని అంటున్నారు. డిప్యూటీ సీఎంగా తన బాధ్యతల విషయంలో కృష్ణతేజ అనుభవం ఉపయోగ పడుతుందని పవన్ కల్యాణ్ గట్టి నమ్మకంతో ఉ న్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిసేందుకు వచ్చిన
అధికారిగా గుర్తింపు పొందారు. కేరళలో వరదలు ప్రళయం సృష్టించిన సమయంలో ఆయన చూపించిన చొరవ జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. ఆ సమయంలో కృష్ణతేజ అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ గా ఉన్నారు. ఆ తర్వాత కాలంలో ఆయనను కేరళ (Kerala )పర్యాటక శాఖ డైరెక్టర్ గా నియమించారు. అనంతరం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు
సమయంలో సచివాలయానికి వచ్చారు. అప్పుడే డిప్యూటేషన్ పై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎంవో కోసం ఇద్దరు, ముగ్గురు ఐఏఎస్ అధికారుల్ని డిప్యూటేషన్ పై తీసుకు వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వారితో పాటు కృష్ణతేజను కూడా పిలిపించే అవకాశం ఉంది.