–2018 లో పోన్ ట్యాప్ కారణoగా నే ఓటమి పాలయ్యాము
–సిట్ విచారణ తర్వాత మీడి యా తో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్
PCC President Mahesh Goud: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచార ణకు తెలంగాణ పీసీసీ చీఫ్ మహే ష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ట్యాప్ చేసిన ఫోన్ నెంబర్లలో ఆయ న నెంబర్ ఉండడంతో కొంత సమా చారం కావాలని సిట్ కోరడంతో కా ర్యాలయానికి వెళ్లారు. సిట్ కు ఆ యన స్టేట్ మెంట్ ను ఇచ్చారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డితో పాటు తన ఫోన్ కూడా ట్యాప్ చేసి తమ మూమెంట్లను ఎప్పటికప్పుడు ప ర్యవేక్షించారన్నారు. ఇదే ఫిర్యాదు ను గతంలో చేశాను. ఇవాళ వాస్త వాలు బయటకు వచ్చాయని తెలి పారు.చట్టానికి వ్యతిరేకంగా అనేక మంది ఫోన్లు టాప్ చేశారన్నారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతల ఫోన్లో ట్యాప్ చేయడం హేయమైన చర్య అని , ఇలాంటి చర్యకు పాల్ప డ్డ నాటి సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్ర జాస్వామ్యాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. తాము మాత్రమే శా శ్వతంగా అధికారంలో ఉండాలి అ నే చెడు ఆలోచనతో ఈ కార్యక్రమా నికి శ్రీకారం చుట్టారు. 2018లో తా ము ఓడిపోవడానికి కారణం కూడా ఫోన్స్ ట్యాప్ చేయడం వల్లే అని అ ర్థమైందని అన్నారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయన్నారు.
తన పూర్తి పేరు పెట్టకుండా నక్సలై ట్లకు సింపతైజర్లుగా ఉన్నారని ట్యా ప్ చేయడం సిగ్గుచేటని, కేటీఆర్ సి గ్గుతో తలదించుకోవాలని, ప్రజా స్వామ్యానికి తూట్లు పొడుస్తూ త మ ఫోన్లను ట్యాప్ చేయడం దుర్మా ర్గమైన చర్య, ఆనాడు తమ ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ది పొందేం దుకు ప్రయత్నం చేశారని, అందుకు వారు శిక్షార్హులన్నారు. భవిష్యత్తు లో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండా లంటే వీరికి శిక్ష పడాల్సిందేనని అ న్నారు. ఇలాంటి దిగజారుడు పనికి ఒడిగట్టిన ఐఏఎస్, ఐపీఎస్ అధికా రులకు కూడా శిక్ష పడాలన్నారు.
ప్రభాకర్ రావు నాటి సీఎస్ ఇద్దరు కలిసి ఎన్నికల ముందు రెండు సం వత్సరాలు ఫోన్ ట్యాప్ చేశారని ఆ రోపించారు. ఆనాడు ఆకస్మాత్తుగా తమ కార్లు ఆపేవారని, ఆపి తని ఖీలు చేసేవారని, అనుక్షణం పోలీ సులు తమను నీడలా వెంటాడేవా రని, అకారణంగా అనేకసార్లు గృహ నిర్బంధాలు చేశారని గుర్తు చేశారు.