— కే వి పి ఎస్, ఎస్ ఎఫ్ ఐ,డి వై ఎఫ్ ఐ, టీ జి ఎస్
Pending Bills Release : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బిల్లు విడుదల చేయాలని కెవిపిఎస్ ఎస్ ఎఫ్ ఐ, డివైఎఫ్ఐ,టిజిఎస్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏవో మోతిలాల్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాల జిల్లా కార్యదర్శులు పాలడుగు నాగార్జున, ఖమ్మం పార్టీ శంకర్, మల్లం మహేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో సోషల్ వెల్ఫేర్, గిరిజన సంక్షేమ శాఖ ల సహకారం తో బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా దళిత విద్యార్థులు 19000, గిరిజన విద్యార్థులు 6000 విద్యార్థులు మొత్తం 25 వేల మంది చదువుకుంటున్నారు.
ప్రతి ఏటా ఫీజులు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించక 154 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి దీనివలన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ చదువుకుంటున్న దళిత, గిరిజన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది బిల్లులు రాకపోవడంతో యజమాన్యాలు ఈ స్కీం పట్ల విద్యార్థులని చేర్చుకోవడం ఆసక్తి చూపడం లేదు. నల్లగొండ జిల్లాలో సుమారు 7 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం స్కూల్ యాజమాన్యం డబ్బులు కట్టండి ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత మీరే తీసుకోండి అంటూ పుస్తకాలు ఇవ్వడం లేదు బట్టలు ఇవ్వడం లేదు. ఈ సంవత్సరం నూతన అడ్మిషన్లు చేపట్టడం లేదు. కావున ప్రభుత్వం వెంటనే బిల్లులను విడుదల చేయాలి ఈ విద్యా సంవత్సరం నూతన అడ్మిషన్లు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుండాల నరేష్ అయ్యా సంఘాల నాయకులు బొల్లు రవీందర్ , గాదే నరసింహ, ఒంటెపాక కృష్ణ, కోరే రమేష్, ముస్కు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా కమిటీలు.