–మోదీతో బంగ్లా పీఎం హసీనా భేటీ
–రెండు రోజుల భారత పర్యటనకు బంగ్లాదేశ్ ప్రధాని
PM Hasina::ప్రజాదీవెన, ఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ మధ్య పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా కీలక ఒప్పందాలు రెండు రోజులు భారత్ పర్యటకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (PM Hasina) ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (PM MODI)ఈ మేరకు చర్చలు జరిపారు. బంగ్లాదేశ్ (Bangladesh) భారతదేశానికి అతి పెద్ద అభివృద్ధి భాగస్వామని ప్రధాని మోదీ అన్నారు. భారత్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ద్వైపాక్షిక పర్యటనకు వచ్చిన మొదటి అతిథి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు, ప్రధాని మోదీ స్వాగతం పలికారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పోస్ట్ చేశారు.
హసీనాకు ఘన స్వాగతం
భారత పర్యటనకు (India tour)వచ్చిన బంగ్లా ప్రధాని షేక్ హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్లో (At Rashtrapati Bhavan)లాంఛనప్రాయ స్వాగతం లభించింది. విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, కీర్తి వర్ధన్ సింగ్ బంగ్లా ప్రధానికి స్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి బంగ్లా ప్రధాని షేక్ హసీనా గౌరవ వందనం స్వీకరించారు. రాజ్ఘాట్లో ( Rajghat) మహాత్మా గాంధీకి షేక్ హసీనా నివాళులర్పించారు.