Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PM Modi: ఊహకందని ఉప్పెనలా విమాన ప్రమాదం

–దయనీయ పరిస్థితి చూసి చలిం చిపోయాను
–బాధిత కుటుంబాల బాధ భరిం చలేనిది
–విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలిం చిన మోదీ
–ఆస్పత్రిలో క్షతగాత్రులకు ప్రధాని పరామర్శ
–అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులతో సమీక్ష

PM Modi: ప్రజా దీవెన, అహ్మదాబాద్: గుజరాత్ అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన ఊహకందని ఉప్పె నలా పెనువిషాదoగా అవతరించిం దిందని ప్రధాని నరేంద్ర మోదీ అభి వర్ణించారు. బాధిత కుటుంబాల బా ధ భరించలేనిదని విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం అహ్మదాబాద్ ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఎయిర్ పోర్టులో ఉన్నతాధికారుల తో సమీక్ష నిర్వ హించారు.

అనంతరం ప్రమాద వివరాలను ఆ ఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అహ్మదాబాద్ సి విల్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామ ర్శించారు. ఘటన జరిగిన తీరు ను అడిగి తెలుసుకున్నారు. గాయప డిన మెడికోలను సైతం పరామర్శిం చారు. ప్రధాని వెంట కేంద్ర పౌర వి మానయాన శాఖ మంత్రి రామ్మో హన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు ఉన్నా రు.

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఎయి ర్ ఇండియా ఎండీ, సీఈవో క్యాం ప్బెల్ విల్సన్ కూడా పరిశీలించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామ ర్శించారు. కాగా బ్రిటిష్ హైకమి షన్ అధికారులు నేడు అహ్మదాబాద్కు చేరుకోనున్నారు. ఘటన స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగు తుండగా మృతదేహాల కోసం శిథి లాల కింద జాగిలాలతో గాలిస్తు న్నారు.

*ఇప్పటి వరకు మొత్తంగా 265 మంది….* ప్రమాదంలో మొత్తం ఇ ప్పటి వరకు 265 మంది చనిపోగా చాలా మంది క్షతగాత్రులు ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. విమా నంలో మొత్తం క్రూతో కలిపి 241 మంది చనిపోయారు. రమేశ్ విశ్వా స్ కుమార్ ఒక్కరే ప్రాణాలతో బయ టపడ్డాడు. ఈ ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూ డా మృతి చెందారు. అలాగే విమా నం బీజై మెడికల్ కాలేజీ హాస్టల్ భ వనంపై కూలడంతో లంచ్ చేస్తున్న 20 మందికి పైగా విద్యార్థులు చని పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్లు, మిగతావారు వివి ధ దేశాలకు చెందిన వారు ఉన్నా రు. కాగా, మృతదేహాలకు ఆస్ప త్రిలో డిఎన్ఏ పరీక్షల ఆధారంగా పోస్టుమార్టం ప్రక్రియను వైద్యులు పూర్తి చేసి అనంతరం మృతదేహాల ను బంధువులకు అప్పగించారు.

*విషాద సంద్రంలో యావత్ ప్ర పంచం…* యావద్దేశాన్ని అహ్మ దా బాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విషా దంలో ముంచెత్తింది. టేకాఫ్ అయి న కొద్ది నిమిషాలపై ఏఐ-171 వి మానం కుప్పకూలడంతో 241 మం ది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. జరిగిందేమిటో తెలుసు కునే లోపు అందరి ప్రాణాలు అనం తవాయువుల్లో కలిసిపోయాయి. అయితే ఒక్కరు మాత్రం ఈ ప్ర lమా దం నుంచి ప్రాణాలతో బయపడి మృత్యుంజయుడుగా నిలిచారు. ఆ భయానక అనుభవాన్ని మీడి యాతో పంచుకున్నారు.

విమానం కూలిపోయిన భయానక క్షణాలను తలుచుకుని భారత సం తతికి చెందిన 40 ఏళ్ల బ్రిటిష్ పౌరు డు రమేష్ విశ్వాస్ కుమార్ రమేష్ చిగురుటాకులా వణికిపోయారు. ప్ర స్తుతం ఆసుపత్రులో ఆయన చికి త్స పొందుతున్నారు. అకస్మాత్తుగా భవంతిలోకి విమానం దూసుకు పోయి పోలిపోయిందని, సెకండ్లలో నే అంతా జరిగిపోయిందని తెలి పారు. తన సీటు సమీపంలో భారీ డ్యామేజ్ జరిగింది. ”మొదట నేను చనిపోయానని అనుకున్నాను. ఆ తర్వాత నేను బతికున్నట్టు గ్రహిం చారు. విమాన ప్రధాన శరీర భాగం తెరుచుకోవడంతో పాకుకుంటూ బ యటపడ్డాను. నా చుట్టూ ఉన్న వారు చనిపోవడమో, చావుకు చే రువలో ఉండటమో కనిపించింది’ అని చెప్పారు. విమానం నుంచి బ యటపడగానే ‘విమానం పేలిపో యింది’ అంటూ అరుస్తూ ఆయన బయటకు రావడం వీడియో ఫుటే జ్‌లో కనిపిస్తోంది. విమానం కుప్ప కూలిన తర్వాత రమేష్ దాని నుం చి జంప్ చేయడం, ఆ తర్వాత స్పృహకోల్పోవడం జరిగినట్టు విశ్వేష్ కుమార్ రమేష్ సోదరుడు తెలిపారు.

*ఆసుపత్రిలో రమేష్‌ కు మోదీ పరామర్శ…* అహ్మదాబాద్ ఆసు పత్రిలో చికిత్స పొందుతున్న క్షత గాత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకు న్నారు. ఈ ప్రమాదం నుంచి బయ టపడిన రమేష్‌ సైతం కలిశారు. ఘ టనా స్థలిని దర్శించి ప్రమాద ఘట నపై ప్రధాన తీవ్ర ఆవేదన వ్యక్తం చే శారు. ఈ ఘటనను తీవ్రంగా కలిసి వేసిందని, అధికారులు అవిశ్రాంతం గా సహాయక చర్యల్లో పాల్గొంటు న్నారని, ఏమాత్రం ఊహించని ఈ ఘటనతో తమ ప్రియతములను కోల్పోయిన వారి చుట్టూనే తన ఆలోచనను తిరుగుతున్నాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

*భూమి మీద నూకలుండి బతికి పోయా..* ఎయిర్ ఇండియా ప్ర మాద ఘటనలో 265 మందిపైగా దు ర్మరణం చెందగా ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డ విషయం తెలిసిందే. ప్రమాదం సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు 1000 డిగ్రీ ల వేడి పుట్టినట్లు తెలుస్తోంది. అ యితే 11Aలో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేశ్ తాను గాయాలతో ఎలా బయటపడ్డాననే దానిపై ఆస్ప త్రిలో వైద్యులకు వివరించాడు. ప్ర మాద సమయంలో నేను కూడా సీ టు బెల్ట్ ధరించాను. ఫ్లైట్ కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యా పించాయి. విమానం రెండు ముక్క లైంది. ఆ సమయంలో నా సీటు పూర్తిగా విడిపోయి పక్కకు వెళ్లిపో యింది. దీంతోపాటు కొన్ని శిథిలా లు తనకు అడ్డుగా ఉండటంతో మంటల నుంచి తప్పించుకోగలి గాను. నేను విమానం నుంచి దూకే శానని చెబుతున్న మాట నిజం కా దని వెల్లడించాడు.