–ప్రాజెక్టు ప్రాంతంలో నిపుణుల బృందం మూడో రోజు పర్యటన
–డీ వాల్ నిర్మాణ ప్రాంతంలో సేక రించిన మట్టి, రాతిని పరిశీలన
–ప్రతిష్టాత్మమైన పోలవరం నిర్మా ణంపై ఏపి ప్రభుత్వం ఫోకస్
Polavaram: ప్రజా దీవెన అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు (Polavaram project) నిర్మాణంపై మళ్లీ ఫోకస్ పెడుతోంది. అందులో భాగంగా ప్రాజెక్టులో ఉన్న ఇబ్బందులను అదిగమించే ప్రయ త్నాలు ప్రారంభించింది. దీనికోసం విదేశీ నిపుణులను (Foreign experts) రంగంలోకి దింపింది. ఇక, ఏలూరు జిల్లా పోల వరం ప్రాజెక్టు ప్రాంతంలో విదేశీ నిపు ణుల బృందం మూడో రోజైన నేడు కూడా వారి పర్యటన కొన సాగుతుంది.ప్రాజెక్టు నిర్మాణంలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యల కు పరిష్కారం చూపేందుకు రెండు రోజుల నుంచి విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటిస్తోంది. గత రెండు రోజులపాటు పోలవరం ప్రాజె క్టులోని కీలక నిర్మాణాలను పరి శీలించిన బృందం మూడవ రోజు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు (Polavaram project) నిర్మాణ ప్రాంతంలో అంతర్జాతీయ నిపుణులబృందం మూడో రోజు డీ వాల్ నిర్మాణ ప్రాంతంలో సేకరించిన మట్టిని రాతిని పరిశీలించారు. మరి న్ని నమూనాల పరిశీలన అనం తరం జలవనరుల శాఖ అధికారు లతో నిపుణుల బృందం చర్చించ నుంది.ఇక పోలవరం ప్రాజెక్టు పరి స్థితిని సమీక్షించేందుకు వచ్చిన అంతర్జాతీయ నిపుణులు అనేక అంశాలు ప్రస్తావించారు. వాటిపై అక్కడ ఉన్న కేంద్ర జలసంఘం నిపుణులు, అఫ్రి డిజైన్ సంస్థ ప్రతినిధులు, స్థానిక ఇంజినీరింగ్ అధికారులు, (Central Water Society experts, representatives of Afri Design, local engineering officials,)ఇతర సంస్థల ప్రతి నిధులు ఇచ్చే సమాధానాలు విం టూ వారి అనుమానాలను నివృత్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు.
అలాగే ఈరోజు, రేపు ప్రాజెక్టు పనులకు సంబంధించి పలు వివరాలు సేకరించిన అనంతరం నిపుణుల బృందం తుది నివేదికను అందించ నుంది. గత రెండు రోజులుగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో (construction areas)పర్యటించి ఎగువ , దిగువ కాపర్ డ్యాం, డి వాల్, పనులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న బృందం ఆయా పనులకు సంబంధించిన వివరాలను జల వనరుల శాఖ అధికారుల నుండి సేకరిస్తున్నారు. డయాఫ్రం వాల్ కు వచ్చిన నష్టమేమీ లేదు డయాప్రం వాల్ ను పరిశీలించిన బృందం శుభవా ర్తను వినిపించారు. పోలవరం ప్రాజె క్టులో నిర్మించిన డయాఫ్రం వాల్పై వరద నీరు ప్రవహంచినంత మాత్రా న ఆ కట్టడానికి ఏమీ కాదని ప్రాజె క్టును పరిశీలించిన అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తెలిపారు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బ తింటుందనే ఆలోచన సరికాదని వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టులో కీలక కట్టడమైన డయాఫ్రం వాల్ గోదావరి భారీ వరదలకు (Heavy flood of Godavari)ధ్వంసం కాగా.. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ ని ర్మించాలా, పాతదానికే మరమ్మ తులు చేసి, కొంతమేర కొత్తది నిర్మిం చి పాత కట్టడానికి అనుసంధా నిం చాలా అని ఇంజినీర్లు అడగ్గా ప్రస్తు తం ఉన్న డయాఫ్రం వాల్ను మర మ్మతు చేసుకుంటే సరిపోతుంది కదా అని ఒక నిపుణుడు వ్యాఖ్యా నించారు. ఈ డయాఫ్రం వాల్కు కొత్త కట్టడం జత చేస్తే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని మరికొందరు ప్రశ్నించగా అలాంటి వేమీ ఉండవనీ స్పష్టం చేశారు. వరద వల్ల డయాప్రం వాల్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదని, అయిదే ఇసుక, మట్టి ఆ ప్రాంతాన్ని కప్పేయడంతో డ్రయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని అనుమానాలు వ్యక్త మయ్యాయయని చెప్పారు. డయా ప్రం వాల్ కి ఇప్పటి వరకూ చిన్న డ్యామేజ్ కూడా జరగలేదంటూ , దీనిపై ఇంకా లోతైన అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు (cm chandra babu)ప్రాజెక్టు పనులపై ఆరా తీశారు. ఇబ్బందులు, ప్రాజెక్టులో లోపాలు తదితర అంశాలపై దృష్టి పెట్టారు ఆ తర్వాత విదేశీ నిపుణులను(Foreign experts) రంగంలోకి దింపి వారి సలహా లు,సూచనలతో ఇక ముందు నిర్మా ణాలు చేపట్లనున్నారు.