Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ponugoti Ranga: 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి;రంగా

Ponugoti Ranga: ప్రజా దీవెన, కోదాడ: బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో జారీచేసి.. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని. ఈ అంశాన్ని కేంద్రపై నెట్టేసి తప్పించుకుంటే 1000 మంది బీసీ నేతలతో కలిసి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటాం’ అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పొనుగోటి రంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం మునగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.

సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులు, బీసీ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రిజర్వేషన్ల అమలు ప్రక్రియ పై ముందు కెళ్లాలని కోరారు. పార్టీల పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటిస్తున్నారని, ప్రభుత్వం చట్టపరంగా బీసీల వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.’చలో ఢిల్లీ’ నిర్వహించి ఈ అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తా మని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల బీసీ నాయకులు మొగిలిచర్ల సత్యనారాయణ, రావులపెంట రాజబాబు, మేకపోతుల వెంకటేశ్వర్లు, పింగిలి వెంకన్న, గండు నారాయణ, రావులపెంట పరుశురాములు, తుమ్మల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.