Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Power generation:శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

–కుడిగ‌ట్టు జ‌ల విద్యుత్ ప్లాంట్ నుంచినాగార్జున సాగ‌ర్ కు నీరు విడుద‌ల
–త్వ‌ర‌లో ఎడ‌మ గ‌ట్టు నుంచి కూడా ఉత్ప‌త్తి

Power generation:ప్రజా దీవెన, శ్రీశైలం: శ్రీశైలం జలా శయం (Srisailam water bed) కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి (Power generation)మంగళవారం నుంచి ప్రారంభ మైంది. ఆంధ్రప్రదేశ్‌ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి తద్వారా దిగువన ఉన్న నాగార్జున సాగర్ నీటి (Nagarjuna Sagar water)అవసరాల నిమిత్తం 3 టీఎం సీల నీటిని కోరారు. సాగర్ అధికా రులు, దీంతో విద్యుత్ ఉత్పత్తితో పాటు సాగర్ కి 3 టీఎంసీల నీటిని విడుద‌ల చేసే క్రమంలో విద్యుత్ ఉత్పత్తని ప్రారంభించారు. మొత్తం గా శ్రీశైలం ఏపీ కుడిగట్టు జల వి ద్యుత్ కేంద్రంలో 4 యూనిట్లు ద్వా రా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 15,919 క్యూసెక్కుల నీటిని దిగువ నాగా ర్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు అధికారులు.

అయితే శ్రీశైలం డ్యామ్‌కు (Srisailam Dam) ఇన్‌ ఫ్లో నిల్‌గా ఉంది, విద్యు త్‌ ఉత్పత్తి నేపథ్యంలో ఔట్ ఫ్లో 15, 919 క్యూసెక్కులుగా ఉండగా, శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 812.80 అడుగులుగా ఉంది. ప్రాజె క్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామ ర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తు తం ప్రాజెక్టులో 35.9850 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరిం తస్థాయిలో నీటిమట్టం చేరితో ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం అవు తున్నారు తెలంగాణ అధికా రులు.