Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Prime Minister Modi: భారతదేశం శీఘ్రగతిన పురోగమనం

–ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయి
–త్వరలోనేమూడో అతిపెద్ద ఆర్థిక వ్య వస్థగా భారత్ నిలువనుంది
–దశాబ్దాలుగా పేదరికంలో మగ్గడా నికి కాంగ్రెస్, ఆర్జేడీలే కారణం
–బీహార్‌లోని సివాన్‌ బహిరంగ సభలో ప్రధాన మంత్రి మోదీ

Prime Minister Modi: ప్రజా దీవెన, పాట్నా: భారతదేశం శీఘ్రగతిన పురోగ మిస్తుండటంపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని, త్వరలోనే ప్రపం చలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్య వస్థగా భారత్ నిలువనుందని వా రు బలంగా నమ్ముతున్నారని ప్రధా న మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నా రు. భారతదేశం గ్లోబల్ పవర్‌గా ఎ దగడంలో బీహార్ కీలక భూమిక వ హిస్తోందని చెప్పారు. బీహార్‌లోని సివాన్‌లో శుక్రవారం జరిగిన బహి రంగ సభలో ప్రధాని మాట్లాడారు.

బీహార్‌ను ఆటవిక రాజ్యంలోని నె ట్టిన ఘనత కాంగ్రెస్, ఆర్జేడీల దేన ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజలే ఆటవిక పాలనకు చరమ గీ తంపాడారని, ఇప్పుడు ఎన్డీయే హ యాంలో బీహార్ బలమైన అభివృ ద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. రాష్ట్రం దశాబ్దాలుగా పేదరికంలో మగ్గడాని కి, కార్మికుల వలసలకు కాంగ్రెస్, ఆర్జేడీలే కారణమని అన్నా రు.

ఎన్డీ యే హయాంలో సాధించిన కీ లక విజయాలను ప్రధాని ప్రస్తావి స్తూ, 55, 000 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేశామ ని, 1.5 కోట్ల ఇళ్లకు విద్యుత్ ఇచ్చా మని, 26 కోట్ల మందికి పైపుల ద్వా రా తాగు నీటిని అందించామని చె ప్పారు. బీహార్‌ను ఆటవిక రాజ్యం గా మార్చిన వారు తమ తప్పిదాల ను పునరావృతం చేయాలనుకుం టున్నారని, మీ పిల్లల భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చ రించారు. పేదలకు మరిన్ని ఇళ్లు పే దలకు మరో మూడు కోట్ల ఇళ్లు ని ర్మించి ఇస్తామని ప్రధాని ఈ సంద ర్భంగా హామీ ఇచ్చారు.

ప్రజలే తన కుటుంబ సభ్యులనీ, కుటుంబంలోని ఏ ఒక్కరూ కడగం డ్లపాలు కాకుండా చూస్తామని, వా రి కోసం రేయింబవళ్లూ శ్రమిస్తామ ని, తమ కల నిజమయ్యేంత వర కూ విశ్రాంతి తీసుకునేది లేదని చె ప్పారు. బీహార్ స్వాతoత్ర్య సమర యోధుల గడ్డ అని ప్రశంసించారు.

ఈ సందర్భంగా పలు హౌసింగ్, వాటర్, రైల్, పవర్, మ్యా న్యుఫ్యా క్చరింగ్ రంగాల్లోని పలు అ భివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకు స్థాపన చే శారు. ప్రధానమంత్రి ఆవా స్ యో జన-అర్బన్ (పీఎంఏవై- యూ) కిం ద 6,600 మంది లబ్ధిదారులకు తా ళం చెవులు అందజేశారు. పీఎంఏ వై యూ లబ్ధిదారులకు తొలి విడత ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ. 536 కోట్లు విడుదల చేశారు. మర్హౌరా ప్లాంట్‌ లో తయారైన లోకోమో టివ్‌ను జెం డా ఊపి ప్రారంభించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.