Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

International yoga day: అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

International Yoga day: ప్రజా దీవెన, విశాఖపట్నం: సాగర తీరంలోని విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ భారీ కార్యక్రమం లో ప్రధానమంత్రి న రేం ద్ర మోదీ స్వయంగా హాజర య్యా రు. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ అనే థీమ్‌తో మొదలైన ఈ కార్యక్ర మం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వ ర్యంలో యోగాంధ్ర 2025 పేరిట నిర్వహించబడుతోంది. ఆర్కే బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 26 కిలోమీటర్ల పొడవునా 247 యోగా విభాగాలు ఏర్పాటు చేశారు.

ఈ కా ర్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మం త్రి నారా లోకేశ్, ఇతర ప్రజాప్రతిని ధులు, కేంద్ర మంత్రులు, అధికారు లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యో గులు, పాఠశాల విద్యార్థులు, ఎన్‌ సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, యో గా సంఘాలు, నౌకాదళం, కోస్టల్ గార్డు సభ్యులు, పారిశ్రామికవేత్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్ర పంచ యోగా దినోత్సవం సందర్భం గా ఉదయం 7 గంటలకు 2 లక్షల 70 వేలు దాటిన యోగీలు. సూరత్ లో 1,47,952 మంది రికార్డ్ అధిగ మించడడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆ నందం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రి కార్డ్స్ లో నమోదు కానున్న విశాఖ యోగా కార్యక్రమం.శుక్రవారం సా యంత్రం భువనేశ్వర్ నుంచి విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ, ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వద్ద బస చేశారు. శనివారం ఉదయం 6:25 గంటలకు ఆర్కే బీచ్‌కు చేరుకున్నారు. ఈ సం దర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశిం చి ప్రసంగించారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి మాత్రమే కా క, ప్రపంచ ఐక్యతకు కూడా దో హదపడుతుందని ప్రధాని పేర్కొ న్నారు.

ప్రధాని మోదీ 2014లో యోగా ది నోత్సవ ప్రతిపాదన చేయడంతో, 20 15 నుంచి జూన్ 21న ఈ వే డుకలు జరుగుతున్నాయి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవా న్ని దేశంలోనే కాకుండా ప్రపంచవ్యా ప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజ లు దీని పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు ఉదయం 6.30 నుంచి ఉదయం 7 గంటల వరకు దేశంలోని లక్షకు పైగా ప్రదేశాలలో సామూహిక యోగా ప్రదర్శనలు చేశారు.