Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Prithvi-2: క్షిపణి పృథ్వీ-2 సక్సెస్

–ఒడిశా నుంచి విజయవంతంగా ప్ర‌యోగం

Prithvi-2: ప్రజా దీవెన, చాందీపూర్ : న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ను భారత్ విజయ వం తంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ క్షిపణిని ప్రయోగించారు. పృ థ్వీ-2 (Prithvi-2)ఈ వెర్షన్‌ను డీఆర్ డీవో తయారు చేసింది. ఈ క్షిపణి 350 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉం టుంది. పృథ్వీ-2 అనేది దేశంలో అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణి. దానితో పాటు ఆయుధాలను కూడా మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. అంతకుముందు కూడా ఒడిశా తీరం నుంచి వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి (Strategic ballistic missile)పృథ్వీ-2ను విజయవంతంగా పరీక్షించారు.గతేడాది జనవరిలో ఈ పరీక్ష జరిగింది. స్వల్ప శ్రేణి బా లిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ను విజయ వంతంగా పరీక్షించినట్లు రక్షణ మం త్రిత్వ శాఖ అప్పట్లో ప్రకటించింది. పృథ్వీ-2 క్షిపణి (Prithvi-2 missile) భారతదేశ అణ్వా యుధాల్లో ముఖ్యమైన భాగం. పృథ్వీ-2 క్షిపణి పరిధి 350 కిలో మీటర్లు. పృథ్వీ-2 క్షిపణి చాలా ఎక్కువ స్థాయి ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేధించగలదు. ఉప రితలం నుండి ఉపరితలం వరకు 350న్నర కిలోమీటర్లు కొట్టగల సా మర్థ్యం. తొమ్మిది మీటర్ల పొడవున్న పృథ్వీ క్షిపణి 2003 నుంచి సైన్యం లో ఉంది.