Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MIM chief Asaduddin: నల్గొండ జిల్లా కేంద్రంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దిష్టిబొ మ్మ దగ్ధం

MIM chief Asaduddin: ప్రజా దీవెన, నల్లగొండ : నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ముస్లిం మత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంఐఎం అధినేత పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ బిజెపి పార్టీపై, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై, హిం దూ సంఘాలపై అనుచిత వ్యాఖ్య లకు నిరసనగా గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి నాయకత్వంలో క్లాక్ టవర్ సెంట ర్లో ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓ వైసీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ కేం ద్ర ప్రభుత్వం సవరణలు చేపట్టిన వక్ఫ్ చట్టం 2025 ఏమి లాభాలు ఉన్నాయో చెప్పాలన్న ఓవైసీ, వ్యా ఖ్యలకు ఘాటుగా సమాధానం చె ప్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టువంటి వక్ఫ్ సవరణ చట్టంలో దేశంలో వక్ఫ్ ఆగడాలను అడ్డుకొ ని,పేద ముస్లింలకు మంచి చేయ డానికే మన మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు-2025 తీసుకొచ్చిం దని,ఈ విషయాన్ని ప్రజలకు చేరు వ చేయకుండా, అపోహలు సృష్టిం చి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తి స్తున్నారన్నారు.

ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజా నికి లాభాలు చేకూరనున్నాయని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీ మో ర్చా కార్యకర్తల ద్వారా ప్రతి ఇంటి లోని ముస్లిం మహిళలకు, యువ తకు ఈ సవరణ బిల్లు ద్వారా వ చ్చే ప్రయోజనాలు తెలియజేయా లని సూచించారు. అలాగే, కొన్ని రాజకీయ పార్టీలు ముస్లిం సమా జాన్ని తమ స్వార్థ రాజకీయ అవ సరాల కోసం ఉపయోగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.ఈ బిల్లుతో ముస్లిం సమాజానికి నష్టం జరుగు తుందనే అపోహలను ప్రజల నుం డి తొలగించాలని ఆయన పిలుపు నిచ్చారు.వక్ఫ్ సవరణ బిల్లులో ఇంతకు ముందు లేకా ఇక ముందు వక్ఫ్ ఆస్తిగా ప్రకటించబడిన ఏ ప్ర భుత్వ భూమి లేదా ఆస్తి ఇకపై వ క్ఫ్‌గా పరిగణించబడదన్నారు.

వక్ఫ్ ఆస్తి యాజమాన్యంపై వివా దాలను కలెక్టర్లు నిర్ణయిం చవచ్చు అని సవరణలు చేశారని, ముస్లిమే తరులు వక్ఫ్ బోర్డులలో 2 సభ్యు లుగా ఉంటారన్నారు.దేశంలోని ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ఏకపక్షంగా ప్రకటించడానికి వక్ఫ్‌బోర్డ్‌కు అధి కారం కల్పిస్తోన్న సెక్షన్ 40 రద్దు చేస్తూ సవరణలు చేయబడిం ద న్నారు.తద్వారా ఇకపై ఏ ఆస్తినీ ఏకపక్షంగా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించ డం సాధ్యం కాదన్నారు. అదేవిధం గా నిన్న నల్లగొండ జిల్లా కేంద్రానికి ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవై సీ వస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులని కార్యక ర్తలను అక్రమ అరెస్టులు చేసి సు మారు 15 గంటల పాటు పోలీస్ నిర్బంధించడం సిగ్గుచేటని అలాగే ఒక జిల్లా అధ్యక్షులుగా నల్లగొండ జిల్లా కేంద్రానికి నేను వస్తున్న సం దర్భంలో పోలీసులు నన్ను అక్రమ అరెస్టు చేసి సుమారు 15 గంటల పాటు పోలీసు వాహనాలు మా ర్చుతూ, మా మొబైల్ ఫోన్లను లా క్కొని కనీసం అన్నం కూడా పెట్ట కుండా అన్ని పోలీస్ స్టేషన్లను తి ప్పుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారన్నారు.

నల్గొండ జిల్లా పోలీసులు ఎంఐఎం పార్టీకి మరియు కాంగ్రెస్ పార్టీ నా యకులకి తొత్తులుగా పనిచేస్తు న్నారని రాబోయే రోజుల్లో నల్ల గొం డ పోలీసులపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గతంలో ఈ జిల్లా కేం ద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మోహన్ భగవత్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తే జిల్లా పోలీసులకి ఫిర్యాదు చేసిన తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసుల స్వలాభం కోసం పోలీసుల పోస్టింగుల కోసం మరియు ఇసుక క్వారీల దగ్గర వ సుల్ల కోసం మరియు నిన్న మొన్న జరిగినటువంటి మోటారు దొంగ తనాల్లో దొంగల నుండి లక్షల లక్షల రూపాయలు కమిషన్ తీసుకొని కేసుని పక్కదారి పట్టించారని త్వ రలోనే జిల్లా పోలీసు అధికారుల చిట్టా విప్పబోతున్నామని తెలిపా రు.

నల్లగొండ జిల్లా కేంద్రానికి బహి రంగ సభ పేరుతో వచ్చినటు వంటి అసదుద్దీన్ ఒవైసీ తీవ్రవాదులకు అడ్డగా నల్లగొండలో నివసిస్తున్న టువంటి ఉగ్రవాదులను కలిశారని ఆరోపిస్తున్నాము వెంటనే పోలీసు లు నిజ నిజాలు తేల్చాలని కోరా రు. అసదుద్దీన్ ఒవైసీ నువ్వు పోలీ సులను అడ్డుపెట్టుకొని నల్లగొండ జిల్లాకి వచ్చావు కానీ ఏ పోలీసు లు లేకుండా జిల్లాకు వచ్చే ధైర్యం ఉన్నదా నేను ఈ సందర్భంగా మీకు సవాల్ విసురుతున్న మీరు నిన్న సభలో చేసిన ఆరోపణలని బహిరంగ చర్చకి సిద్ధమా మీ వెంట ఈ జిల్లా మంత్రి అయినా కోమటిరె డ్డి వెంకటరెడ్డి, ఎంఐఎం పార్టీ నా యకులని కాంగ్రెస్ పార్టీ నాయ కులని ,కమ్యూనిస్టు పార్టీ నాయ కులని, టిఆర్ఎస్ పార్టీ నాయకు లని తీసుకొని రండి మేము సమా ధానం చెప్తామని ఆరోపించారు. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ అండదండను చూసు కొని మీ చెంచాలు నల్లగొండలోని వక్ఫ్ కబ్జాలు చేసి నేడు ఆ ఆస్తు ల ని వెంచర్లుగా చేసి డబ్బులు సం పాదిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో భార తీయ జన తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరల్లి చంద్రశేఖర్ , భారతీయ జన తా పార్టీ నల్లగొండ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు , జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లిం గస్వామి , కంచర్ల విద్యాసాగర్ రెడ్డి , పకీరు మోహన్ రెడ్డి , పాశం శ్రీనివాస్ రెడ్డి , ముత్యాల రావు , మండల వెంకన్న, పజ్జురి వెంకట్ రెడ్డి , యువ మోర్చా నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి , దిండు భాస్కర్ గౌడ్ , గుండ్లపల్లి శాంతి స్వరూప్ ,బుడిగే భరత్ తదితరు లు పాల్గొన్నారు.