Punjab National Bank: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు సూచనల మేరకు కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే కో టి రూపాయలు ప్రమాద బీమా ప థకం అమలు చేస్తున్నప్పటికీ, పం జాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా సింగ రేణి సంస్థ బుధవారం కుదుర్చుకు న్న కోటి 25 లక్షల రూపాయల ప్ర మాద బీమా పథకం ఒక చారిత్రక ఘట్టమని సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుతో ఈ ఒప్పందం కుదిరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రమాదవశాత్తు కార్మికులు మృతి చెందినప్పుడు కంపెనీ ఇస్తున్న స హాయం కొంత ఉన్నప్పటికీ వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భరో సా కల్పించాలన్న ఉద్దేశంతో బ్యాం కులతో మాట్లాడి ఈ తరహా ప్రమా ద బీమా పథకాన్ని అమలు చేయ డం జరుగుతుందన్నారు. ఇప్పటికే అమలవుతున్న పథకాల వల్ల కార్మి కుల కుటుంబాలకు గట్టి ఆర్థిక భరో సా లభించిందని అన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు కూ డా మిగిలిన బ్యాంకుల అన్నిటిక న్నా ఎక్కువగా కోటి 25 లక్షల రూ పాయల బీమా పథకాన్ని అమలు చేయడానికి ముందుకు రావడం, అ లాగే సాధారణ మరణం సంభవించి న వారికి 10 లక్షల రూపాయల ట ర్మ్ ఇన్సూరెన్స్ ను కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అమలు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. పంజా బ్ నేషనల్ బ్యాంక్ ద్వారా సింగరేణి పొరుగు సేవల ఉద్యోగుల కోసం40 లక్షల రూపాయల ప్రమాద బీమా ఒప్పందాన్ని కూడా అమలు చే స్తు న్న విషయాన్ని ఈ సందర్భంగా ఆ యన గుర్తుచేశారు.
సింగరేణి సంస్థ తన వ్యాపార విస్త రణ చర్యలను పెద్ద ఎత్తున చేప డు తోందని సోలార్ విద్యుత్తు, గ్రీన్ హై డ్రోజన్, గ్రీన్ ఎలక్ట్రిసిటీ తదితర రం గాలలోకి ప్రవేశిస్తుందనీ, ఈ నేప థ్యంలో బ్యాంకులతో సత్సంబంధా లు కొనసాగిస్తూ ముందుకు పోతుం దని పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈవో అండ్ ఎండీ శ్రీ అశో క్ చంద్ర మాట్లాడుతూ సింగరేణి సంస్థతో తాము కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఇతరులకు కూడా ఆదర్శ ప్రాయమని అన్నారు. ఈ పథకం నే టి నుండి సింగరేణి ఉద్యోగులకు అ మల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా ఒప్పందాలను ఇతర శాఖ లకు కూడా విస్తరించనున్నమని తె లియజేశారు.
సింగరేణి వ్యాపార విస్తరణ ప్రాజెక్ట్ లకు తమ తరఫున పూర్తి సహకా రం అందిస్తామని, సింగరేణితో కలి సి ముందడుగు వేయడం ఎంతో సంతోషకరమని ఆయన పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ తరఫున ఇంకా డైరెక్టర్ ఆప రేషన్ శ్రీ ఎల్.వి సూర్యనారా య ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూ మెంట్ శ్రీ ఎస్.డి.ఎం.సుభాని, జన రల్ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ ఎన్. వి.రాజశేఖర్ రావు, పంజాబ్ నేష నల్ బ్యాంక్ హైదరాబాద్ రీజినల్ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ కు మార్ చుగ్ ఇంకా ఇతర అధికా రులు పాల్గొన్నారు.