— ఈడీ యంత్రాంగం ద్వారా చెప్పారు తెలియవచ్చింది
— కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
Rahul Gandhi: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ed)తనపై దాడులు చేసేందుకు సిద్ధమవుతోం దని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. లోక్సభలో ‘చక్రవ్యూహం’ అంటూ తాను చేసిన ప్రసంగం కేంద్ర ప్రభు త్వ (Central Govt) పెద్దలకు నచ్చలేదన్నారు. ఆ ప్రసంగం నేపథ్యంలో త్వరలోనే తనపై ఈడీ దాడులకు పక్కా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలియవచ్చిందని వెల్లడించారు. ఆ ఇద్దరిలో ఒకరికి తన చక్రవ్యూహం ప్రసంగం నచ్చలేదని తెలుస్తోందని, అందువల్లే తనపై దాడులకు సిద్ధ మవుతున్నట్లు ఈడీలో పనిచేస్తున్న కొంతమంది తెలిపారని రాహుల్ పేర్కొన్నారు. ఈ దాడుల కోసం ఎదురుచూస్తున్నా చాయ్, బిస్కట్లు సిద్ధంగా ఉంచండని ఈడీ డైరెక్టరేట్ ఖాతాను ట్యాగ్ చేస్తూ రాహుల్ గాం ధీ శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
కేంద్ర బడ్జెట్పై (Central budget)చర్చ లో భాగంగా సోమవారం లోక్సభ లో రాహుల్ ప్రసంగిస్తూ ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మవ్యూ హంలోకి నెట్టివేస్తున్నారని ధ్వజమె త్తారు. మహాభారతంలోని కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమర ణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ, హోంమం త్రి అమిత్ షా తదితరులపై విమ ర్శలు గుప్పించారు. అయితే, తనపై ఈడీ దాడులు (ED attacks) జరగొచ్చన్న రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ తిప్పికొ ట్టింది. వయనాడ్ ఎంపీగా అక్కడ జరిగిన విషాద ఘటనకు బాధ్యత వహించాల్సి వస్తుందనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజ మెత్తింది.