–టి యు డబ్ల్యూ జే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డ మీది బాలరాజ్ గౌడ్
Sakshi Editor Raid : ప్రజా దీవెన, కూకట్ పల్లి: ఆం ధ్ర ప్రదేశ్ పోలీసులు ఎలాంటి నోటీసు లు లేకుండా “సాక్షి” దినపత్రిక ఎడి టర్ ఆర్. ధనుంజయ్ రెడ్డి ఇంటికి వెళ్లి సోదాలు చేయడాన్ని కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ నాయకులు ఖండిం చారు. కెపిహెచ్బి కాలనీలోని మహా త్మ గాంధీ విగ్రహం వద్ద శనివారం జర్నలిస్ట్ సంఘాల నాయకులు నిర సన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలి స్ట్ సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షు డు గడ్డ మీది బాలరాజ్ మాట్లా డుతూ ఆం ధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వా మ్యం ఖూనీ అయిందని, అందుకు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై అక్రమ సోధా లు చేయడమే నిద ర్శనమని అన్నారు. పత్రికా స్వేచ్ఛ కు భంగం కలిగించకుండా ప్రభు త్వాలే బాధ్యతగా ఉండాలని, కక్ష పూరితంగా దాడి చేయడం సరికా దన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభు త్వం తీరుకు ప్రజలను, జర్నలిస్ట్ ల ను చైతన్యపరిచి మరో ఉద్యమం చేసి జర్నలిస్టుల సంఘాల హక్కు లను కాపాడుకుంటామని ఐ జే యు నాయకుడు, ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షుడు విద్యా వెంక ట్ అన్నారు.
ప్రశ్నించే గొంతును నొక్కి పెట్టే స్తారా.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిం చే గొంతును నొక్కి పెట్టేస్తారా అని సాక్షి దినపత్రిక కూకట్ పల్లి జోన్ ఇంచార్జీ పరమేశ్ అన్నారు. ఇసుక, లిక్కర్, మైనింగ్, స్కాం లు, రైతుల కు మద్దతు ధర కల్పించకపోవడం ఇలా ప్రభుత్వ వరుస వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి గొంతు నొక్కా లని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నో టీసులు లేకుండా పోలీసులు ఇం ట్లోకి చొరబడి సోదాలు చేయడం, భయపెట్టడం సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం అని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉందని దానిని నొక్కి పెట్టకూడదని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జర్నలిస్టు ల ఇంటిపై పోలీసులు వెళ్లడం ఖం డిస్తున్నామని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల ని, లేదంటే విద్యార్థి సంఘాలు ఉ ద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయ కులు దయ సాగర్, శ్రీనివాస్ గౌడ్, మాణిక్ రెడ్డి, రాహుల్, నాగరాజు, ప్రవీణ్, సాగర్ రెడ్డి, మారుతి సాగ ర్, రామ్, నవీన్, రమేష్, నరసింహ రావు, వెంకటేష్, రామారావు, పలు పార్టీ ల నాయకులు ఐస్ క్రీమ్ వెం కట్ రెడ్డి, శివా రెడ్డి, జొన్నల శ్రీనివా స్ రెడ్డి, వెంకటస్వామి రెడ్డి, విద్యా ర్థి సంఘాల నాయకులు దిలీఫ్, అ శోక్ గౌడ్, బిక్షపతి తదితరులు పా ల్గొన్నారు.