Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rape: మహిళపై 72 మంది అత్యాచారం

Rape: ప్రజా దీవెన, ఫ్రాన్స్ : ఓ మహిళపై 72 మంది రేప్ (Rape)చేసిన కేసు ప్రపం చంలోనే సంచలనం రేపింది. స్వ యంగా భర్తే ఆమెకు మత్తుమందు ఇచ్చి పలువురు వ్యక్తులతో అత్యా చారం (Rape) చేయించిన ఘటన ఫ్రాన్స్ లో జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణలో న్యా యమూర్తి సంచలన నిర్ణయాన్ని వెలువరించారు. బాధితురాలిపై జరిగిన అత్యాచారానికి సంబంధిం చిన వీడియో ఆధారాలను కోర్టులో ప్రదర్శించే సమయంలో కోర్టు ఆవ రణలో ఉన్న సాధారణ ప్రజలు కూ డా చూడవచ్చని చెప్పారు. సున్ని తమైన మనసు ఉన్నవారు, మైనర్లు మాత్రం కోర్టు (court)పరిసరాల్లో లేకుం డా చూడాలని పోలీసులను ఆదే శించారు. బాధితురాలిపై జరి గిన దారుణానికి సంబంధించిన నిజా లను వెలికి తీసే క్రమంలో అవసర మైతేనే వీడి యోలను ప్రదర్శిస్తా మని జడ్జి పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్ ప్రభుత్వ రంగ సంస్థలో పని చేసే 71 ఏళ్ల వ్యక్తి తన భార్యపై పదేళ్లపాటు అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. రాత్రివేళ ఆహారంలో డ్రగ్స్ కలిపి ఇచ్చి ఆమెకు తినిపిం చేవాడు. ఆమె మత్తులోకి జారుకు న్నాక కొందరు వ్యక్తులతో భర్తే అత్యాచారం చేయించాడు వాటిని తానే సీక్రెట్ కెమెరాల్లో రికార్డు చేశా డు. 2011 నుంచి 2020 వరకూ ఇదే తంతు కొనసాగింది. అయితే ఓ షాపింగ్ సెంటర్లో ఇతర మహిళల ను సీక్రెట్ గా వీడియోలు తీస్తుండగా సెక్యూరిటీ గార్డు పట్టుకుని పోలీసులు (The police) అప్పగిం చడంతో ఆ దుర్మార్గుడి బండారం బయటపడింది.