Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rash Driving: మఫ్టీలో పోకిరీల ఆటకట్టు వణుకు పుట్టిస్తున్న పోలీసులు

Rash Driving: ప్రజాదీవెన, రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకతాయిలు, పోకిరీల భరతం పడుతున్నారు షీ టీమ్‌ (she team). జిల్లాలోని ఇల్లంతకుంట మండలం ప్రభుత్వ కళాశాల వద్ద కొంత మంది పోకిరీలు బైక్ లపై ర్యాష్ డ్రైవింగ్ (Rash Driving) చేస్తూ అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న షీ టీమ్ (she team)సభ్యులు మఫ్టీ లో కళాశాల వద్ద నిఘా ఉంచారు. పోకిరీలను అదుపులోకి తీసుకుని పెట్టి కేసు నమోదు చేశారు. మహిళలు, విద్యార్థులను (Women and students) వేధించినా, వెంబడించినా, సామాజిక మధ్యమాల ద్వారా ఇబ్బంది కలిగినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇల్లంతకుంట మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద ఉదయం, సాయంత్రం సమయంలో బైక్ లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విద్యార్ధినిలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

జిల్లా షీ టీమ్ కి (she teams)సమాచారం ఇవ్వగా జిల్లా షీ టీం సిబ్బంది కాలేజ్ వద్ద మఫ్టీలో కాపుకాచారు. బైక్ పై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న కొంత మంది ని రెడ్ హ్యాండెడ్ పట్టుకొని వారిపై పెట్టి కేసు నమోదు చేశారు. మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో విద్యాసంస్థల వద్ద రద్దీగల ప్రదేశాల్లో షీ టీమ్ సిబ్బంది మఫ్టీలో నిరంతరం నిఘా పెంచారు. విద్యార్థిలను వేధిస్తున్న ఇప్పటి వరకు పోకిరీలపై 37 కేసులు నమోదు చేసి కట కటలకు పంపారు. కేసులు నమోదు చేయడం తో పాటు వారి తల్లిదండ్రుల (parents) సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.మూడు నెలల వ్యవధిలో మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న 22 మందిని అదుపులోకి తీసుకొని జ కౌన్సెలింగ్ నిర్వహించి మరల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా జిల్లా షీ టీమ్ ని సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు షీ టీమ్ (she teams) నంబర్ 87126 56425 డయల్ 100 కు సమాచారం ఇవ్వగలరు మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడతాయని పోలీసులు తెలిపారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలతో పోకిరిల ఆగడాలు తగ్గాయి.. నిరంతరం షీ టీం నిఘా పెంచింది..