Ratan Tata: ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా (Ratan Tata) గొప్ప దాతృమూర్తిగా, మానవతావాదిగా అయినా పేరును సొంతం చేసుకున్నారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ బిగ్గెస్ట్ మల్టీ నేషనల్ కంపెనీగా మారడంతో పాటు అనేక మందికి స్ఫూర్తి దాయకం అయ్యింది. కొన్ని రోజులు అనారోగ్యంతో ఉన్న రతన్ టాటా (Ratan Tata) అక్టోబర్ 9 రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక రతన్ ఇక లేరని తెలిసి భారతదేశ ప్రజలందరూ తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఈ గొప్ప వ్యక్తికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
టాటా గ్రూప్ రతన్ నేతృత్వంలో చాలా వ్యాపారాల్లోకి (businesses) విస్తరించిందని అందరికి తెలిసిందే. మనం రోజూ వాడే చాలా వస్తువులు కూడా టాటా గ్రూప్ కంపెనీ తయారు చేస్తుంది. రతన్ టాటా టాటా గ్రూప్కి అధ్యక్షుడిగా ఉండగా, ఈ గ్రూప్ని మరింత పెద్దదిగా చేయడానికి చాలా కష్టపడ్డారు. అలాగే కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభించి, టాటా గ్రూప్ని వరల్డ్ క్లాస్ గ్రూప్గా మార్చిడంలో ముందు వరుసలో ఉంటారు. వాస్తవినికి రతన్ టాటా తండ్రి నావల్ టాటాను టాటా ఫ్యామిలీ దత్తత తీసుకుంది. అందుకే రతన్ టాటా టాటా గ్రూప్లో ఒక సాధారణ ఉద్యోగిగానే తన కెరీర్ను మొదలు పెట్టారు. 1962లో రతన్ టాటా టాటా ఇండస్ట్రీస్లో అసిస్టెంట్గా చేరారు.అనంతరం టాటా స్టీల్లో కూడా పనిచేశారు. ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ పరిశ్రమ ఇప్పుడున్నంత పెద్దది కాదు. అయినప్పటికీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అనే సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా రతన్ టాటా గారు పని చేశారట.
ఆలా 1974లో రతన్ టాటా టాటా సన్స్ బోర్డులో చేరారు. అనంతరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ కోర్సు చేశారు. 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్గా అయ్యారు. 1991లో జేఆర్డి టాటా తర్వాత రతన్ “టాటా సన్స్, టాటా ట్రస్ట్”లకు అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పట్టారు . అనంతరం టాటా గ్రూప్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.రతన్ టాటా టాటా గ్రూప్కి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద విజయాలను సొంతం చేసుకున్నారు.
రతన్ టాటా మన భారతదేశ ప్రభుత్వం నుండి పద్మ భూషణ్, పద్మ విభూషణ్ (Padma Bhushan, Padma Vibhushan) అనే అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన తన ఆస్తిలో దాదాపు 60 శాతం దానం చేశారు. ఇది ఆయన మంచితనానికి నిదర్శనం అనే చెప్పాలి. మన భారతదేశంలో జరిగిన ప్రతి అభివృద్ధిలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. సరిహద్దుల్లో ఉన్న సైనికుల (Soldiers)నుండి పొలాల్లో పనిచేసే రైతుల వరకు, టాటా గ్రూప్ ద్వారా ఆయన చాలా సేవలను అందించారు.
అలాగే సామాన్య, మధ్య తరగతి వారు తమ కుటుంబంతో కలిసి తమ కారులో ప్రయాణించాలనే కలను నెరవేర్చే ఉద్దేశ్యంతో టాటా నానో కారును తయారు చేయించి మార్కెట్లోకి వచ్చేలాగా చేసారు. రతన్ టాటా తమ ఉత్పత్తులు, సేవల ద్వారా సామాన్య ప్రజలకు చేరువయ్యారు. ఆయన పని మన భారతదేశంలో IT విప్లవంలో కీలక పాత్ర అన్నడంలో ఎటువంటి సందేహాలు లేవు.