Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RBI Good News : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు, రెపోరేటు 5.5శాతం య థాతథంతో వడ్డీరేట్లపై కీలక నిర్ణ యం

RBI Good News : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలోని పేద, సామాన్య ప్రజలకు మరోసారి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. వడ్డీ రేట్లపై కీ లక నిర్ణయం తీసుకోవడం ద్వారా రెపో రేటు యథాతథంగా ఉంచు తూ ప్రజలకు గుడ్ న్యూస్ అందిం చింది. దీంతో ఇకపై కూడా రెపో రే టు 5.5 శాతం యథాతథం ఉండ నుంది.

ఇదిలా ఉండగా ఆర్బీఐ రేపో రేటు లను స్థిరంగా ఉంచండం ఇది రెండో సారి కావడం గమనార్హం. ఈ క్రమం లో తాజా ఆర్బీఐ ప్రకటనతో ప్రజ లందరి నెలసరి వాయిదా చెల్లిం పు లలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టమవుతోంది.

*ఆర్థిక వ్యవస్థ బలపడే దిశగా ఆర్బిఐ…* దేశ ఆర్థిక వ్యవస్థను బ లపరిచే దిశగా ఆర్బీఐ అడుగులు వేస్తోంది. అయితే ఇటీవల అతర్జా తీయంతో పాటు మన దేశంలో నె లకొన్న కొన్ని పరిస్థితుల కారణాల తో ఈ సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్‌ లో జరిగిన సమావేశంలో రేపో రేట్ల ను 0.25 శాతం చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలి సిందే.

ఇదిలా ఉండగా జూన్‌ నెలలో నిర్వ హించిన సమావేశంలో ఆర్బీఐ ఏ కంగా 50 బేసిస్‌ పాయింట్లు తగ్గిం చింది. కాగా ఇలా వరుసగా మూడు కీలక సమావేశాల్లో ఆర్బీఐ రేపో రే టును 1 శాతం మేర తగ్గించింది. అ మెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్ పై విధించిన పన్నుల భారం, అంతర్జా తీయ పరిణామాల నేపథ్యంలో ఆ గస్టు నెలలో రేపో రేటు మాత్రం య థాతథంగా 5.5 శాతం వద్దే ఉంచు తూ నిర్ణయం తీసుకుంది. అయితే అక్టోబర్ నెలలో కూడా రేపో రేటు ను యథాతథంగా ఉంచుతూ ప్రక టన విడుదల చేయడం శుభపరి ణామం.