Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Red Book Effect:ఏపీ లో ఎక్కడికక్కడ రాక్షస పాలన

–నెల‌న్న‌ర పాల‌న‌లోనే శాంతిభ‌ద్ర‌త లు చిన్నాభిన్నం
–వినుకొండ‌లో వైసీపీ కార్య‌క‌ర్త హ‌ త్య‌ వ‌రుస‌గా వైసీపీ నేత‌ల‌పైనా, ఆస్తులుపైనా దాడులు
–రెడ్ బుక్ దాడుల‌పై రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు

Red Book Effect:ప్రజా దీవెన, అమ‌రావ‌తి : ఆంధ్ర ప్రదేశ్ లో రాక్షస పాలన కొనసాగు తోందని, రెడ్ బుక్ (Red Book) రాజ్యాంగం అమ లవుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ (YCP chief Jagan) మండిపడ్డారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై జగన్ స్పందించారు. రషీద్ కుటుంబానికి సానుభూతి తెలిపా రు. కొత్త ప్రభుత్వం అధికారం చేప ట్టి నెలన్నర రోజులు మాత్రమే అయిం దని గుర్తుచేశారు. ఈలోపే రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాల కు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారం టూ టీడీపీ సర్కారుపై తీవ్ర విమ ర్శలు చేశారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కరవైందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని (ycp) అణగదొక్క డమే లక్ష్యంగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

రాజకీయ కక్షతో దాడులకు తెగబ డుతున్నారని జగన్ విమర్శించారు. వినుకొండలో బుధవారం రాత్రి జరిగిన హత్య రాజకీయ కక్ష సాధింపు నకు పరాకాష్ఠ అని చెప్పారు. ఈ దారుణం ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి (cm)సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తు న్నారని జగన్ (jagan)ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌ రాజ్యాం గాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని అన్నారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని విమర్శించారు.అధికారం శాశ్వతం కాదని గుర్తెరిగి హింసాత్మక విధానా లు వీడాలని చంద్రబాబును జగన్ గట్టిగా హెచ్చరించారు. కొత్త ప్రభు త్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభు త్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశా రు. ఏపీలో దిగజారిన శాంతిభద్రత ల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధా ని మోదీ, హోంమంత్రి అమిత్‌షా లకు విజ్ఞ‌ప్తి చేసినట్లు ట్వీట్ (tweet) లో తెలి పారు. బాధితులకు పార్టీ తరఫున అండగా నిలబడతామని, అన్ని రకాలుగా ఆదుకుంటామని పార్టీ కార్యకర్తలకు జగన్ హామీ ఇచ్చా రు.కాగా, విన‌కొండ‌లో వైసీపీ నాయ‌ కుడిని ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డుపై హ‌త్య చేయ‌డం అంశాన్ని వైసీపీ రాష్ట్ర‌ప‌తి దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేర‌కు వివ‌ రాల‌తో రాష్ట్ర‌ప‌తిని ట్యాగ్ చేస్తూ ఎక్స్ ద్వారా ట్విట్ చేసింది.టీడీపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను అడ్డుకోవాల‌ని ఈ ట్వీట్ లో కోరింది.

మీ వాళ్లే హ‌త్య చేస్తే.. మా మీద నింద‌వేస్తారా?…

ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగినా ముందు టీడీపీ (tdp)మీద తోసేయడమే పని గా పెట్టుకుందని వైసీపీ పార్టీపై అధి కార పార్టీ మండిపడింది. వినుకొండ లో బుధవారం జరిగిన వైసీపీ కార్య కర్త రషీద్ హత్యపై ట్విట్టర్ లో స్పం దించింది. ‘పొద్దున్నే 3 గంటలకు ఫోన్ చేసి బాబాయ్‌ని లేపించి, చంద్రబాబు చంపాడని పేపర్ లో వేసిన నీచ చరిత్ర వీళ్ళది, ఏది జరిగినా, ముందు టీడీపీ మీద తోసేయటమే అంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.బుధవారం జరిగిన దారుణ హత్యలో చనిపోయిన రషీద్, చంపిన షేక్ జిలానీ ఇద్దరూ వైసీపీ కార్యకర్తలేనని ట్వీట్ లో పేర్కొంది. ఇద్దరూ వైసీపీ నేత, స్థానిక రౌడీగా పేరొందిన పీఎస్ ఖాన్ కు ప్రధాన అనుచరులేనని వెల్లడిం చింది. సదరు పీఎస్ ఖాన్ వైసీపీ చీఫ్ జగన్ కు ప్రధాన అనుచరుడని వివరించింది. అయితే, తప్పు ఎవ రు చేసినా తప్పేనని, తప్పు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. గడిచిన ఐదేళ్లలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ రెచ్చి పోయిన వైసీపీ సైకోలకు పట్టిన మదందించి, వారు చేసే దారు ణాలను ఆపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసింది.

మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSR Congress Party) అధ్యక్షుడు జగన్ (jagan) శుక్రవారం వినుకొండలో పర్యటిం చనున్నారు. టీడీపీ కార్యకర్త చేతి లో దారుణహత్యకు గురైన వైయ స్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిం చ‌నున్నారు. వారికి పార్టీ త‌రుపున భ‌రోసా ఇవ్వ‌నున్నారు. కాగా,నిన్న వినుకొండ‌లో ర‌షిద్ హ‌త్య‌కు గుర య్యాడు. ఈ హ‌త్య టిడిపి ప‌నే నంటూ వైసిపి ఆరోపిస్తుండ‌గా, అత‌డిని హ‌త్య చేసింది మీ పార్టీ కార్య‌క‌ర్తేనంటూ టిడిపి కౌంట‌ర్ ఇచ్చిన విషయం తెలిసిందే.