–కేంద్ర మంత్రులకు సిఎం రేవంత్ బృందం వినతులు
–తమ లక్ష్యం రూ. 300లకే ఇంటిం టికీ ఇంటర్నెట్ కు సహకరించాలి
–తెలంగాణలో 93 లక్షల కుటుంబా లకు ఇవ్వడమే ధ్యేయం
–అందుకు గాను ఈ పథకానికి వడ్డీ లేకుండా రూ.1779 కోట్లు ఇవ్వండి
–క్రీడా వర్సిటీకి మానవతా దృక్పథం తో ఆర్థిక సాయం చేయండి
–క్రీడా సంస్థల ఆధునికీకరణ డీపీఆ ర్లు ఆమోదించండి
–తెలంగాణలో ప్రతిష్ఠాత్మక క్రీడా పో టీల నిర్వహణ అవకాశమివ్వండి
–టెలికాం మంత్రి సింధియా, కేంద్ర క్రీడా మంత్రి మాండవీయను కోరిన సీఎం రేవంత్, భట్టి, జూపల్లి
Revanth Reddy: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: టీ–ఫైబర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వ్యా ప్తంగా 93 లక్షల ఇళ్లకు నెలకు రూ.3 00కే ఫైబర్ కనెక్షన్ (Fiber connection) ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుం దని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతి రాదిత్య సింధియాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy)తెలి పారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు నెలకు రూ. 300కే ఇంట ర్నెట్, కేబుల్ టీవీ, ఈ–ఎడ్యుకేషన్ సేవలు (Internet, cable TV, e-education services) అందిస్తామని చెప్పారు. టీ–ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని కల్పించడం తమ లక్ష్యమన్నారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కేంద్ర మంత్రి సింధియాతో భేటీ అయ్యారు. రూ.1779 కోట్ల పెట్టు బడులతో ప్రతిపాదించిన టీ–ఫైబర్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.530 కోట్లను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరిం చిందని వివరించారు.
మొత్తం పెట్టు బడి వ్యయం రూ.1,779 కోట్లను యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఎఫ్ఓ) ద్వారా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణంగా ఇవ్వా లని సీఎం విజ్ఞప్తి చేశారు. టీ–ఫైబర్ ద్వారా 65,500 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ (గవర్నమెంట్ టూ గవర్న మెంట్), జీ2సీ (గవర్నమెంట్ టూ సిటీజన్) కనెక్టివిటీ కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 300 రైతు వేదికలకు టీ–ఫైబర్ ద్వారారైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోందని, సాంఘిక సంక్షేమ పాఠశాలలకూ (Social welfare schools)టీ–ఫైబర్ (Tea – fiber)ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్ఓఎఫ్ఎన్) మొదటి దశ మౌలిక సదుపాయా లను రాష్ట్ర ప్రభుత్వానికి సకాలం లో అందించాలని కేంద్ర మంత్రి సింధియాను సీఎం రేవంత్ కోరారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఎన్ఓఎఫ్ఎ న్ మొదటి దశ లీనియర్ ఆర్కిటెక్చ ర్ ఆధారంగా నడుస్తుంటే, మిగతా ప్రాంతాల్లో రింగ్ ఆర్కిటెక్చర్ ఆధా రంగా టీ–ఫైబర్ నడుస్తోందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. నెట్ వర్క్ సమర్థ నిర్వహణ, (Efficient management of network,) వినియోగం కోసం సకాలంలో ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశ మౌలిక సదుపాయాల ను అందించాలని ప్రతిపాదించారు. ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశను భార త్ నెట్–3 ఆర్కిటెక్చర్కు మార్చడా నికి గతేడాది అక్టోబరులో కేంద్ర ప్రభు త్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన డీపీఆర్ను త్వరగా ఆమో దించాలని విజ్ఞప్తి చేశారు. భారత్ నెట్–3 ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రజలకు ఈ–గవర్నె న్స్ను అందించవచ్చని అభిప్రాయ పడ్డారు. గ్రామీణ ప్రాంతాలకు హై– స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాల కల్పనకు ఉద్థేశించిన భారత్ నెట్ ఉద్యమి పథకాన్ని టీ–ఫైబర్కు వర్తింపజేయాలని సింధియాను సీఎం కోరారు.
క్రీడా వర్సిటీపై (Sports varsity) మంత్రి మాండ వీయ తో తెలంగాణ యువతలో ని క్రీడా నైపుణ్యాలను వెలికితీేసం దుకు క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ట్లు కేంద్ర క్రీడామంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయకు ముఖ్యమంత్రి రేవం త్రెడ్డి తెలిపారు. క్రీడా విశ్వవిద్యా లయంలో అన్ని రకాల క్రీడలకు సంబంధించిన శిక్షణ, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. విశ్వవిద్యాలయానికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ, అంత ర్జాతీయ క్రీడల నిర్వహణకు అవ సరమైన మౌలిక వసతులన్నీ తెలం గాణలో ఉన్నాయని, భవిష్యత్తులో నిర్వహించనున్న ఒలింపిక్స్తో పాటు ఇతర జాతీయ, అంతర్జా తీయ క్రీడలు నిర్వహించే అవకాశా న్ని తెలంగాణకు ఇవ్వాలని కోరా రు. మంత్రి మాండవీయను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, పర్యాటక మంత్రి జూప ల్లి కృష్ణారావు కలిశారు.
క్రీడా శాఖకు (sports acadamy) సంబంధించి తమ లక్ష్యాలను, ఆకాంక్షలు, తెలంగాణకు ఉన్న ఘనతను కేంద్ర మంత్రికి ముఖ్య మంత్రి వివరించారు. అంతర్జాతీయ వేదికలపై క్రీడాకారులు రాణిం చడానికి అవసరమైన అన్ని వసతు ల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తోందని చెప్పారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, సరూర్ నగర్ స్టేడి యం, ఎల్బీ స్టేడియం, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, ఓయూ క్యాం పస్, జింఖానా గ్రౌండ్, హుస్సేన్ సాగర్ (Sports Complex, Sarur Nagar Stadium, LB Stadium, KVBR Indoor Stadium, OU Campus, Gymkhana Ground, Hussain Sagar) ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈత కొల నులు, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడి యంలు, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్, షూటింగ్ రేంజ్, ఫుట్బాల్ గ్రౌండ్స్, స్కేటింగ్ ట్రాక్స్, వాటర్ స్పోర్ట్స్, ఇతర క్రీడలకు వసతులు ఉన్నా యని కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్రెడ్డి వివరించారు. హైదరాబాద్లో వివిధ కేటగీరిల ఫైవ్ స్టార్ హోటళ్లు ఉన్నాయని, విమాన, రైలు సర్వీసులతో అను సంధానమై ఉందని తెలిపారు. 2002లో నేషనల్ గేమ్స్, 2003లో ఆఫ్రో–ఏషియన్ గేమ్స్, 2007లో ప్రపంచ మిలటరీ గేమ్స్ నిర్వ హించి న అనుభవం హైదరాబాద్కు ఉంద ని గుర్తు చేశారు. ఒలింపిక్స్, ఏషి యన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించే అవకాశం భారత్కు వచ్చినపుడు తెలంగాణకు కూడా అవకాశం ఇప్పించాలని కోరారు. 2025 జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో హైదరా బాద్కు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవీయకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్థికి ఖేలో ఇండి యా పథకం కింద నిధులు విడు దలను పెంచాలని కోరారు. గచ్చి బౌలిలోని జీఎంసీ బాలయోగి స్ట్టేడియం, సెంట్రల్ యూనివర్సి టీ(హెచ్సీయూ)లోని షూటింగ్ రేంజ్, ఎల్బీ స్టేడియం, హకీంపేట లోని స్పోర్ట్స్ స్కూల్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియాలలో మౌలిక వస తుల అభివృద్థికి తాము ఇప్పటికే పంపించిన డీపీఆర్లను ఆమోదిం చాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.