— డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్రస్థాయిలో ఉండాలి
–డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ను నిర్వహించాలి
–రాత్రిళ్లు ఫుడ్ కోర్టులు నిర్వహించే వారిని ఇబ్బంది పెట్టొద్దు
–కమిషనర్లు, ఎస్పీల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: డ్రగ్స్, సైబర్ నేరాల (Drugs and cyber crimes) విషయంలో ఉక్కు పాదం మోపాలని పోలీస్ శాఖను సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. భద్రతపై ప్రజలకు భరోసా కల్పిం చేందుకు అన్ని చర్యలు చేపట్టా లని, అవసరమైతే డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్ర స్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. పోలీస్ కళ్లెదుటే ఉన్నాడనేలా రహదారు లపై కనిపించాలని సూచించారు. కమిషనర్లు, ఎస్పీలు (Commissioners, SPs) తమ పరిధిలోని స్టేషన్లను ఎప్పటికప్పు డు తనిఖీ చేయాలని, క్రమంతప్ప కుండా సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభ ద్రతలు, డ్రగ్స్ కట్టడి ఎజెండాగా డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో పాటు కమిషనర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ (Revanth Reddy) సచివాలయంలో మంగళ వారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశా రు. హైదరాబాద్లో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యం లో శాంతిభద్రతలపై దృష్టిసారించా లన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్తో (Drunk and drive) పా టు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా నిర్వ హించాలని ఆదేశించారు. ప్రజలు, పోలీసులకు మధ్య వారధిగా ఉం డేందుకు స్టేషన్ల పరిధిలో శాంతి కమి టీలను పునరుద్ధరించాని, బాధితుల పట్ల మాత్రమే స్నేహంగా ఉండాలని, నేరగాళ్లతో కాదన్నారు. రాత్రి వేళల్లో ఫుడ్ కోర్టులు నిర్వ హించే వారిని ఆంక్షల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఐటీ రంగంలో వారు రాత్రి వేళల్లో పని చేయాల్సి ఉంటుందని, ఈ విష యం గుర్తుంచుకోవాలని సూచిం చారు. కాగా, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు తగ్గాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇదే వివ రాలను గణాంకాలతో మీడియాకు వెల్లడించాలని సీఎం ఆదేశించారు.
విదేశీయులపై దృష్టిపెట్టండి డ్రగ్స్ కేసుల్లో (drugs case)విదేశీయుల ప్రమే యం నేపథ్యంలో వారు ఏ పని మీద వస్తున్నారు ఏం చేస్తున్నా రనేదానిపై దృష్టిసారించాలని సీఎం (cm) నిర్దేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ బానిస లు, వాడకందారులను డీ అడిక్షన్ కేంద్రాల్లో ఉంచాలని, అందుకోసం చర్లపల్లి జైల్ను వినియోగించు కోవాలని సూచించారు. మాదకద్ర వ్యాల నియంత్రణకు పోలీస్, ఎక్సై జ్ శాఖ సమన్వయంతో కదలాల న్నారు. మానమ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని విభాగా లు కదలాని పేర్కొన్నారు. కాగా, కొల్లాపూర్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ను సీఎం ఆదేశించారు. తనపై ఆరోపణలు వచ్చినందున సిట్ వేయాలని డీజీపీకి లేఖ రాసినట్లు మంత్రి జూపల్లి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కేసును వీలై నంత త్వరగా పరిష్కరించి నింది తులను పట్టుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. నకిలీ విత్తనా లు, ఎరువుల తయారీ, విక్రయంపై ఉక్కుపాదం మోపాలని కమిషనర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు.
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కు పాదo సీఎం సమావేశంలో పాల్గొ న్న డీజీపీ, పోలీస్ అధికారులు
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ జితేందర్ (DGP Jitender for SP) ఆదేశిం చారు.క్షేత్రస్థాయి పోలీసింగ్ తెలు సుకునేందుకు త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని డీజీపీ జితేందర్ కమిషనర్లు, ఎస్పీలకు తెలిపారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీఎం రేవంత్తో సమావేశానికి వచ్చిన అధికారులతో డీజీపీ తొలుత తన కార్యాలయంలో సమావేశమ య్యా రు. ఆయన బాధ్యతలు చేపట్టాక నేరుగా భేటీ కావడం ఇదే మొదటి సారి. ప్రభుత్వ లక్ష్యాలు, పోలీస్ పనితీరు, అనుసరించాల్సిన విధా నాలపై సుదీర్ఘంగా చర్చించారు.
శాంతిభద్రతల పరిరక్షణ (Maintenance of law and order), డ్రగ్స్ తదితర అంశాలపై సమీక్షించారు. స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేయా లని, ఆయుధ లైసెన్సుల జారీలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సంబం ధించిన కేసులను సత్వరం పరిష్క రించాలన్నారు. డ్రగ్స్ కట్టడిపై ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని.. మీ పరిధిలో అన్ని చర్యలు తీసుకోవాలని కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ ప్రత్యేకంగా చెప్పారు. కాగా, డీజీపీగా తొలి సమావేశం కావడం, అదనపు డీజీపీ (DGP)(శాంతిభద్రతలు)గా విధులు నిర్వహించిన అనుభవం ఉండ డంతో జితేందర్ కొంత సీరియస్గా ఉన్నట్లు సమాచారం. చెప్పద లుచుకున్నది సూటిగా చెప్పడంతో పాటు ఎక్కడైనా నిర్లక్ష్యం బయట పడితే శాఖాపరమైన చర్యలుంటా యని హెచ్చరించినట్లు తెలిసింది. యూనిట్ ఆఫీసర్లుగా కింది అధికారులు, సిబ్బంది పనితీరును పర్యవేక్షించడంతో పాటు వారితో పనిచేయించాల్సిన బాధ్యత కూడా అధికారులపైనే ఉందన్నారు