Minister Ponguleti: రెవెన్యూ మంత్రి పొంగులేటి కీలక ఆదేశం, మూసీ పరివాహక ప్రాంత ప్రజలను తక్షణమే అప్రమత్తం చే యండి
Minister Ponguleti : ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాలో వర్షాల కారణంగా ఇప్ప టి వరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి న ష్టం జరగలేదని, మూసి ప్రాజెక్టు గే ట్లు ఎత్తిన కారణంగా జిల్లాలోని కే తేపల్లి, శాలిగౌరారం మండలాల్లోని ప్రభావిత గ్రామాల ప్రజలను అప్ర మత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియ జేశారు.భారీ వర్షాలపై రాష్ట్ర రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు,సంబంధిత జిల్లా అధికారు లతో వీడియో కాన్ఫెరెన్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా నల్గొండ జి ల్లాలోని పరిస్థి తులను జిల్లా కలెక్టర్ మంత్రికి తెలి యజేస్తూ మూసి ప్రా జెక్ట్ 15 గేట్ల ను ఎత్తివేసి నీటిని కిం దికి వదలడం జరిగిందని దీనివల్ల భీమారం లోలెవెల్ కాజ్ వే బ్రిడ్జిపై నీరు పొంగిప్రవహిస్తున్నందున అక్క డ ప్రజలు బ్రిడ్జి ని దాటి వెళ్లే సాహ సం చేయకుండా బారికేడ్లు ఏర్పా టు చేయడంతో పాటు, ట్రాక్టర్లను అడ్డంగా ఏర్పాటు చేశామని తెలి పారు.
జిల్లాలో భారీ వర్షాలు లేని కారణం గా పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయం పై ఆలోచించి నిర్ణయం తీ సుకుంటామని,వర్షాల దృష్ట్యా జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. ఇందుకు రెవె న్యూ శాఖ మంత్రి స్పందిస్తూ నాగా ర్జునసాగర్ ఎడమ కాలువ నుండి క నిష్ట స్థాయిలో నీటిని విడుదల చే యాలని, ఒకే సారి ఎక్కువ మొత్తం లో నీటిని విడుదల చేస్తే కాలువ తెగిపోయేందుకు ఆస్కారం ఉంద ని, దీనిని దృష్టిలో ఉంచుకుని నీటి నియంత్రణ చేయాలని చెప్పారు.
వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం జి ల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో వ ర్షాలపై సమీక్షిస్తూ మరో రెండు, మూడు రోజులపాటు భారీ వర్షాలు రానున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అందుబా టులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా చర్యలు తీ సుకోవాలని ఆదేశించారు.వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికా రులు ముందు జాగ్రత్త చర్యలు తీ సుకోవాలని,ప్రజలను అప్రమత్తం చే యాలని తెలిపారు. వర్షాలను దృ ష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ కా ర్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పా టు చేయడం జరిగిందని, ఏవైనా సమస్యలుంటే కంట్రోల్ రూమ్ లోని టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1800 425 1442 కు తెలియజేయాలని కోరారు.
లోతట్టు ప్రాంతాల వద్ద ప్రత్యేకించి లో లెవెల్ కాజ్ వే ల వద్ద ప్రజలు దా టి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవా లని చెప్పారు.వర్షాలు కురుస్తున్నం దున రైతులకు అవసరమైన యూ రియాను అందించేందుకు ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవ సాయ అధికారిని ఆదేశించారు. మిషన్ భగీరథ అధికారులు అప్ర మత్తంగా ఉంటూ ప్రజలకు రక్షిత మంచి నీటిని సరఫరా చేసే విధంగా సిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడ తా గునీటి పైప్ లైన్ లీకేజీ వంటివి ఏ ర్పడకుండా చూడాలన్నారు. విద్యు త్ ప్రమాదాలు జరగకుండా, విద్యు త్ అంతరాయం లేకుండా చూడాల ని విద్యుత్ ఘాతం వల్ల పశువులు చనిపోకుండా, పొలాల వైపుకు ప శువులు రాకుండా చూడాలని వి ద్యుత్ శాఖ అధికారులను ఆదేశిం చారు. ఇందుకుగాను వంగిపోయిన స్తంభాలు,వేలాడుతున్న వైర్లు ఉం డకూడదని, ఉంటే వెంటనే వాటిని సరి చేయాలని, విద్యుత్ అధికారు లు, సిబ్బంది అందరూ అందుబా టులో ఉండాలని చెప్పారు.
వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్ర మత్తంగా ఉండి 24 గంటలు అందు బాటులో ఉండాలని, వర్షాలు తగ్గిన తర్వాత సీజనల్ వ్యాధులు, అం టువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పంచా యతీ అధికారితో పాటు, మున్సిప ల్ కమిషనర్లు పారిశుధ్య లోపం లే కుండా చూడాలని ,ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిం చాలని ఆదేశించారు.పారిశుద్ధ్య సి బ్బంది అందుబాటులో ఉండాల న్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ లో ముఖ్యమైన శాఖల అధికారు లు వారి సిబ్బందికి విధులను ఏర్పా టు చేసి డ్యూటీలో ఉండేలా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు.
లో లెవల్ కాజ్ వే ల వద్ద ప్రజలు దాటకుండా పోలీస్ సిబ్బందితో పా టు, పంచాయతీ సిబ్బంది అందు బాటులో ఉండి అప్రమత్తంగా ఉం డాలని తెలిపారు.వర్షాల కారణంగా ఎక్కడ ప్రాణనష్టం, ఆస్తి నష్టం జర గకుండా చర్యలు తీసుకోవాలని క లెక్టర్ తెలిపారు .అంతకుముందు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గడచిన రెండు రోజుల్లో కొన్ని ప్రాం తాల్లో అనుకున్న దానికంటే ఎక్కు వ వర్షం కురిసిందని,ఈరోజు తిరిగి ఈ నెల 15 న కొన్ని జిల్లాలలో భా రీ, అతి భారీ వర్షాలు కురిసే అవకా శం ఉన్నందున అన్ని జిల్లాల కలెక్ట ర్లు అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవా లని, ముందు జాగ్రత్తలు తీసుకోవా లని, వర్షం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల లో ప్రజలకు సహాయక చర్యలు చే పట్టాలని, ఇందుకుగాను ఎలాంటి నిధుల కొరతలేదని, ప్రతి జిల్లాకు కోటి రూపాయలు ఇవ్వడం జరిగిం దని, ఎక్కడైనా వర్షాల వల్ల రోడ్లు, విద్యుత్తు వంటి వాటికి అంతరా యం కలిగితే తక్షణమే పునరు ద్ధరించాలని, అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రత్యేక దృష్టి కేం ద్రీకరించాలని, అధికారులు, సి బ్బం దికి సెలవులు రద్దు చేయాలని, అ వసరమైనచోట ఎస్ డిఆర్ఎఫ్ ,ఎన్ డి ఆర్ ఎఫ్ టీములు సిద్ధం చేసుకో వాలని, వరద ప్రభావిత ప్రాంతాల లో ప్రజలు ఇబ్బందులు గురికాకుం డా చూడాలని,లో లెవల్ కాజ్ వే ల వద్ద పోలీసు, ఇతర సిబ్బందిని ఆప్ర మత్తంగా ఉంచాలని తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావుతో పాటు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు మాట్లాడుతూ భా రీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లా ల వారీగా తీసుకోవలసిన జాగ్రత్తల పై తెలియ జేశారు. రెవెన్యూ అదన పు కలెక్టర్ జె.శ్రీనివాస్,సంబంధిత జిల్లా అధి కారులు ఈ వీడియో కా న్ఫెరెన్స్ కు హాజరయ్యారు.