–ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం
–శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
Road Accident: నాగర్కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో (Srisailam Ghat Road)ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణిం చారు.ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈప్ర మాదం జరిగింది.హైదరాబాద్ (hyderabad) లోని బొల్లారానికి చెందిన నలుగురు వ్య క్తులు శ్రీశైలం దైవదర్శనానికి వెళు తూ ఈ ప్రమాదానికి గురయ్యారు.
ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు వ్యక్తులు కారులో ఉన్నా రు. వీరంతా మద్యం తాగి ఉండటం తోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీ సులు ప్రాధమికంగా తేల్చారు.ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, ఒకరికి తీవ్రగాయాల య్యాయి. గాయపడిన వ్యక్తిని శ్రీశైలంలోని సున్నిపెంట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు (case filed) చేసి దర్యాప్తు చేస్తున్నారు.