Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Robotic Experts : ఆశానిరాశలు,సొరంగంలోకి రోబో టిక్ నిపుణులు

Robotic Experts : ప్రజా దీవెన, నాగర్ కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరం గం ప్రమాదంలో మరణించిన వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసా గుతూనే ఉన్నాయి. అందుబాటు లో ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగిస్తూ సాగుతోన్న మృత దేహాల కోసం వెతుకులాట మరింత ముమ్మరమైంది. దాదాపు 13 రోజు ల క్రితం టన్నెల్ లో కూలిపోవడం తో 8 మంది చిక్కుకుపోయిన విష యం విదితమే. వారి కోసం అప్పటి నుంచి అన్వేషణ కొనసాగుతోంది. దేశంలోని అత్యాధునిక టెక్నా లజీ ని వినియోగించడంతోపాటు నిపు ణులను రప్పించి బాధితులను బ యటికి రప్పించేందుకు ప్రయత్నిం చారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ తో పాటు వివిధ బృందాలు శక్తివం చన లేకుండా ప్రయత్నిస్తున్నాయి.

ఇందులో భాగంగా నిన్న కేరళ నుం చి వచ్చిన కేడావర్ జాగిలాలు శుక్ర వారం ఉదయం టన్నెల్ లోకి వెళ్లా యి. బెల్జియం మ్యాల్నోయిస్ బ్రిడ్ కు చెందిన ఈ కేడావర్ శునకాలు 15 అడుగుల లోతులో ఉన్న మృ తదేహాలను కూడా గుర్తిస్తాయన్న విశ్వాసాన్ని అధికారులు ప్రదర్శిస్తు న్నారు. మధ్యాహ్నం తర్వాత ఏదో ఒక సమాచారం వస్తుందని అధికా రులు భావిస్తున్నారు. ఇదిలా ఉండ గా దాదాపు మధ్యాహ్న సమయం లో ప్రాం తంలో టన్నెల్ లోకి రోబో టిక్ నిపుణులు వెళ్లారు. వీరి వెంట ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్స్ కూడా వె ళ్లడం గమనార్హం. రోబోల అవసరం ఏమేరకు ఉంటుందనే అంచనాకు వచ్చిన తర్వాత రోబోల ఆపరేషన్ మొదలవుతుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా అవ సరమైన చోట తవ్వకాలు జరిపేం దుకు ఎన్డీఆర్ఎఫ్ బృం దంతో పాటు 110 మందిని కూడా తీసు కెళ్లారు.