— తెలంగాణ రాష్ట్ర ప్రాణుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం
–నిపుణుల కమిటీ సూచనల మే రకు పనులు ప్రారంభిస్తాం
–ఎన్.జి.ఆర్.ఐ ఆధ్వర్యంలో ఎల క్ట్రోమెగ్నటిక్ సర్వే చేస్తాం
–సింగూర్ డ్యామ్ భద్రతకు కట్టుది ట్టమైన చర్యలు చేపడతాం
–సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ పై ఐ ఐ టి ఖరగ్ పూర్ అధ్యయన నివేదిక పరి శీలిస్తాం
–భారీ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
SLBC Tunnel : ప్రజా దీవెన, హైదరాబాద్: అర్దాం తరంగా నిలిచి పోయిన ఎస్.ఎల్. బి.సి ప్రాజెక్ట్ పనుల పునరుద్ధరణ కు ప్రణాళికా బద్దంగా కార్యాచరణ కు పూనుకున్నామని రాష్ట్ర నీటిపా రుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పే ర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రా జెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆయన వెల్లడించా రు. ఈ విషయమై శుక్రవారం రోజు న డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచి వాలయంలో జరిగిన సమీక్షాసమా వేశంలో పలు అంశాలపై చర్చించా రు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్.ఎ ల్. బి.సి పనులను పునఃప్రారంభిం చేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూ పొంచినట్లు ఆయన తెలిపారు.
అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంతో పాటు పాల నాపరమైన అనుమతులు పొందేం దుకు గాను త్వరలోనే ముఖ్యమం త్రి ఏ.రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమం త్రి మల్లు భట్టి విక్రమార్కలతో స మావేశం కానున్నట్లు ఆయన తెలి పారు.
దురదృష్టవశాత్తు జరిగిన ఎస్. ఎ ల్.బి.సి టన్నెల్ ప్రమాదం అనం త రం ఏర్పాటు చేసిన నిపుణుల క మిటీ నివేదికను,సూచనలను అ నుసరించి పునరుద్ధరణ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు.శ్రీశైలం దిగువ బాగాం నుంచి వచ్చే వరద కాలువ మిగిలి న 9 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకానికి ఆటంకంగా మారిందని ఆయన ఆ వేదన వ్యక్తం చేశారు.ఫలితంగా ప్ర తి సంవత్సరం ఆ నీటిని ఎత్తిపోసేం దుకే ప్రతీ సంవత్సరం 750 కోట్లు కే వలము విద్యుత్ చార్జీలను చెల్లిం చాల్సి వస్తుందన్నారు.అత్యంత వె నుకబడిన ప్రాంతాలకు సాగు నీ రు,ఫ్లోరోసిస్ రహిత సాగు నీటిని అందించేందుకుద్దేశించ బడిన ఈ ప్రాజెక్ట్ మరో తొమ్మిది కిలోమీటర్లు సొరంగ మార్గం పూర్తి అయ్యే సమ యంలో జరిగిన ప్రమాదం దురదృ ష్టకరమన్నారు.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసు కుని ఆధునిక పరిజ్ఞానంతో ప్రాజెక్టు పనులను పునరుద్ధరించి పూర్తి చే యాలి అన్నదే ప్రభుత్వ సంకల్పమ న్నారు.అందులో భాగంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూ ట్(NGRI) ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రోమెఘ్నటిక్ సర్వే ని ర్వహించనున్నట్లు ఆయన తెలిపా రు.పర్వత భూభాగంలో ఉన్నందు న హెలికాప్టర్ సర్వే తప్పని సరైంద న్నారు.ప్రాజెక్టు పునరుద్ధరణ పను ల ప్రారంభానికి ఈ సర్వే దోహద ప డుతుందని ఆయన ఆశాభావం వ్య క్తం చేశారు.అంతే గాకుండా జియా లజికల్ సర్వే ఆఫ్ ఇండియా(G. S. I)ని కుడా ఈ పనుల్లో భాగస్వా మ్యం చేస్తామన్నారు.పునరుద్ధరణ పనులు ప్రణాళికా బద్దంగా నిర్వ హించేందుకు గాను లిడార్ సర్వే ను కుడా నిర్వహించబోతునట్లు ఆయ న ప్రకటించారు.అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొం దిన అంచనా వ్యయాన్ని మించనీ యకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేసేం దుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
*మూడు దశాబ్దాల తరువాత నీ టిపారుదల శాఖలో పదోన్నతు లు*….మూడు దశాబ్దాల సుదీర్గ వి రామం అనంతరం నీటిపారుదల శా ఖలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేశామన్నారు.అదీ కుడా పారదర్శ కంగా నిర్వహించామని,ఏ.యి.యి ల నుండి సి.ఇ ల వరకు 47 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నుండి డిప్యూ టీ ఇంజినీర్ల వరకు 127 మంది, ఎస్.ఇ ల నుండి సి.ఇ ల వరకు 13 మంది ఉన్నారన్నారు.
అన్నీ విభాగాల సిబ్బందికి 33 సం వత్సరాల త రువాత స్కెల్ తో పా టు పదోన్నతులను క్రమబద్దీ కరిం చామన్నారు.ఇందుకు ప్రతిభ, సీని యారిటీ లను ప్రాతిపదికను తీసు కున్నామన్నారు. ఇక నుండి నీటి పారుదల శాఖా సిబ్బంది తమ త మ బాధ్యతలపై పూర్తి స్థాయిలో దృ ష్టి సారించాలని ఆయన ఉద్బోధిం చారు. పెండింగులో ఉన్న నీటిపా రుదల ప్రాజెక్టులను పూర్తి చేసే ప నులలో నిమగ్నం కావాలని సిబ్బం దిని ఆయన ఆదేశించారు.
*సింగూర్ డ్యామ్ కు కట్టుదిట్ట మైన చర్యలు*….సింగూర్ డ్యామ్ ను పరిశీలించి అత్యవసర భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన అధికా రులను ఆదేశించారు.కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో ఉపేక్షిస్తే స హించేది లేదన్నారు. ప్రస్తుత వర్షాకా లంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్యా మ్ లు,రిజర్వాయర్ లతో పాటు ఇ తర జలాశయాలను నిత్యం పర్య వేకక్షించాలని ఆయన సూచిం చా రు. ప్రమాదం అని భావించి ప్రాం తాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
*ఐ ఐ టి ఖరగ్ పూర్ నివేదిక పరిశీలన….* …తెలంగాణ రా ష్ట్రంలో నిర్మిస్తున్న సమ్మక్క బ్యా రేజ్ తో పాటు ఆంద్రప్రదేశ్ ప్రభు త్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజె క్టు ల బ్యాక్ వాటర్ తో ఛత్తీస్ ఘడ్ పై చూపే ప్రభావాల పై ఐ ఐ టి ఖరగ్ పూర్ జరిపిన అధ్యయనం నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. ములు గు జిల్లా ఏటూరునాగరం మండ లంలోని తుపాకులగూడెం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం తెలంగాణా ప్ర భుత్వం ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటువంటి బ్యారేజ్ నిర్మా ణంతో ఛత్తీస్ ఘడ్ లో సుమారు 40 హెక్టార్లు ముంపు కు గురవు తుందని ఐ ఐ టి ఖరగ్ పూర్ ఇచ్చి న నివేదికలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.
దీని ప్రభావం ఛత్తీస్ ఘడ్ లోని కో టూర్,తార్లగూడ,గంగారాం,కంబల్పేట లతో 10.9 చ.కి.మీ భూబా గం ముంపుకు గురౌతుందని అధ్య యనంలో తేలిందన్నారు.అయితే అదే సమయంలో ఈ బ్యారేజ్ ని పూర్తి చేసేందుకు గాను ఛత్తీస్ ఘడ్ తో సంప్రదించి అవసరమైన అను మతులు తీసుకుంటామన్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 6.94 టి. యం.సి ల నీటితో 16.40 ఎకరా లకు సాగు నీరు అందుతుందన్నా రు.2017 లో ప్రారంభమైన ఈ ప్రా జెక్ట్ నిర్మాణం 2022 లో పూర్తి కా వల్సి ఉండగా వివిధ కారణాలతో పనులలో జాప్యం జరిగిందన్నారు. ఛత్తీస్ ఘడ్ తో సంప్రదింపులు జ రిపి త్వరితగతిన పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.నీటిపారుదల రాష్ట్ర సలహాదారుడు ఆడిత్యాదాస్ నా ధ్,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఇ.ఎన్.సి లు అంజద్ హు స్సేన్, రమేష్ బాబు,ఆర్&ఆర్ కమి షనర్ శివకుమార్ నాయుడు,సి.ఇ అజయ్ కుమార్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.