–ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధాన్ని ఎత్తివేసిన కేంద్రం
–దశాద్దాలుగా కొనసాగుతున్న నిషేధo ఎత్తివేతపై ఆర్ఎస్ఎస్ స్వాగతo
RSS: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ (RSS) (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యకలా పాల్లో పాల్గొనకుండా అమల్లో ఉన్న ఉన్న నిషేధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)నేతృత్వం లోని ఎన్డీఎ ప్రభు త్వం ఎత్తివేసింది. కొన్ని దశాద్దా లుగా కొనసాగుతున్న ఈ నిషే ధా న్ని ఎత్తివేయడాన్ని ఆర్ఎస్ఎస్ స్వాగతించింది. ఈ నిర్ణయం దేశ ప్రజా స్వామ్య వ్యవస్థను బలో పే తం చేస్తుందని పేర్కొంది.ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యకలా పా ల్లో పాల్గొనకుండా ఇప్పటివరకు ఉ న్న నిషేధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఎ (nda) ప్రభుత్వం ఎత్తి వేసింది. కొన్ని దశాద్దాలుగా ఉ న్న ఈ నిషేధాన్ని ఎత్తివేయడాన్ని ఆర్ఎస్ఎస్ స్వాగతించింది. ఈ నిర్ణయం దేశ ప్రజా స్వామ్య వ్య వస్థను బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించింది. ఆర్ఎస్ఎస్ నిషేధానికి సంబంధించి పూర్వపరా లు ఇలా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ (RSS)సభ్యుడు నాథూరామ్ గాడ్సే, మహా త్మా గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ ఎస్ కార్యకలాపాలపై ఆందోళనల కారణంగా 1948లో అప్పటి కాంగ్రె స్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ను చట్టవి రుద్ధమైన సంస్థగా ప్రకటించింది. 1948 ఫిబ్రవరిలో గాంధీ హత్యానం తరం సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ని నిషేధించారు. అయితే 1966లో మళ్లీ నిషేధించారు. గోహత్యకు వ్యతిరేకంగా 1966లో పార్లమెం ట్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగా యి. ఈ నిరసనకు ఆర్ఎస్ఎ స్-జనసంఘ్ లక్షలాది మందిని సమీకరించారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో పలువురు చనిపోయారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ నవంబ ర్ 30, 1966న ప్రభుత్వ ఉద్యోగు లను ఆర్ఎస్ఎస్లో చేరకుండా నిషేధించారని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవ్య తెలిపారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత మరోమారు ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన లు వెల్లువెత్తాయి. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు వీహెచ్పీ, బజ రంగ్ దళ్, జమాతే ఇస్లామీ హిందీ, స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాలపై కూడా నిషేధం విధించారు.
కొనసాగుతూనే ఉన్న న్యాయ పోరాటo…. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో (Swayam Sevak Sangh) సభ్యుడైన ప్రభుత్వ అధికారి పదోన్నతికి అనర్హుడని మై సూర్ హైకోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యల బుర్గా (రాయచూరు జిల్లా)లో ప్రభు త్వ సహాయ న్యాయవాది రంగనా థాచార్ అగ్నిహోత్రి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు జూలై 06, 196 6న ఈ తీర్పును వెలువరించింది. అగ్నిహోత్రి ఆర్ఎస్ఎస్లో క్రియాశీ ల సభ్యుడిగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆయనను మున్సిఫ్గా నియమించలేదు. దీనిని ప్రశ్నిస్తూ అగ్నిహోత్రి కోర్టుకు వెళ్లగా, అగ్నిహో త్రిని మున్సిఫ్గా నియమించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘RSS అనేది హిందుయేతరుల పట్ల ద్వేషం లేదా కోపం లేని రాజకీయేత ర సాంస్కృతిక సంస్థ. ప్రజాస్వామ్య జీవన విధానాన్ని స్వీకరించే భారత దేశం వంటి దేశంలో, ఇటువంటి శాంతియుత సంస్థల సభ్యత్వం మున్సిఫ్ల నియామకానికి అనర్హులను చేస్తుందనే ప్రతి పాదనను అంగీకరించడం సమం జసం కాదని మైసూర్ హైకోర్టు పేర్కొంది. ఇదిలా ఉంటే పంజాబ్, హర్యానా రాష్ట్రం కేసులో 21 డిసెం బర్ 1967న చండీగఢ్ హైకోర్టు రాంఫాల్ తొలగింపు ఉత్తర్వులను రద్దు చేసింది. నేషనల్ వాలంటీర్ అసోసియేషన్ (National Volunteer Association) కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు రాంఫాల్ ను 196 5లో సర్వీస్ నుంచి తొలగించారు. అయితే అతను ఆర్ఎస్ఎస్ తో తన భాగస్వామ్యాన్ని అంగీకరిం చాడు. RSS ఒక రాజకీయ పార్టీ కా దని, అందువల్ల ఎలాంటి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని వాదించాడు. పంజాబ్ ప్రభుత్వం ప్రకారం, RSS ఒక రాజకీయ పార్టీ. అందువల్ల, వారి భాగస్వామ్యం ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. అయితే, ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ అని చెప్పడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేక పోవ డంతో రాంఫాల్ను రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టులో సవాల్ చేశారు.