–ప్రజలకు,ప్రభుత్వ అధికారుల మధ్య ఆర్టిఐ కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి
RTI : ప్రజాదీవేన, కోదాడ : కోదాడ నియోజకవర్గ కేంద్రoలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 కార్యాలయంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జిల్లా అధ్యక్షులు గోవింద నవీన్ ఆధ్వర్యంలో కోదాడ మండల అధ్యక్షుడిగా బాలేబోయిన రామారావు, చిలుకూరు మండల అధ్యక్షుడిగా నూకపంగు వినోద్ ను నియమించడం జరిగింది. ముఖ్యఅతిథిగా సమాచార హక్కు రక్షణ చట్టం 2005 రాష్ట్ర సహాయ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు గోవింద్ నవీన్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధమని, సమాచార హక్కు చట్టం పైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలాగా కార్యకర్తలు పనిచేయాలని, ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మధ్య వారధి లాగా పని చేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలాగా కృషి చేయాలని, అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయాలకు ఆర్టిఐ బోర్డులను ఏర్పాటు చేసేలాగా కృషి చేయాలని, సమాజంలో ప్రజల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి ప్రతి ఆర్టీఐ కార్యకర్తలకు కృషి చేయాలని, ప్రతి గ్రామo నుండి ఒకరిద్దరిని ఆర్టిఐ కార్యకర్తలను తయారు చేసి ఆయా గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర నిర్వహించాలని కోరారు…