International Yoga Day: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎస్.ఎస్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ నల్గొండలో ప్రత్యేక కార్యక్ర మం నిర్వహించింది. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు హాజర య్యారు. ఎస్సై సైదులు మాట్లాడు తూ యోగా అనేది మానసిక మరి యు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుప రిచే ఒక ప్రాచీన విజ్ఞానం అని తెలి పారు. యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, ఏకాగ్రతను పెం చుకోవచ్చు మరియు మెరుగైన ఆ రోగ్యాన్ని పొందవచ్చు అని వివరిం చారు.
అనంతరం వారికీ పాఠశాల కరస్పాండెంట్ సత్య శ్రీ మరియు ప్రిన్సిపల్ సత్యనారాయణ శాలువ తో సన్మానించడం జరిగింది. విద్యా ర్థులు యోగా ఆసనాలు ఎంతో ఉత్సాహంగా ప్రదర్శించారని పాఠశాల కరస్పాండెంట్ సత్య శ్రీ తెలియజేశారు . అదేవిధంగా వారు యోగా యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ ఉపాధ్యాయులు ఉపాధ్యాయునీయులు విద్యార్థులతో పాటు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.