SC Reservations : ప్రజా దీవెన, కోదాడ:ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించకుండా ఎస్సీ వర్గీకరణ పై హామీ ఇచ్చి కాలయాపన చేస్తూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మాదిగల ఆగ్రహానికి గురై గాంధీభవఫైదాడి చేసిన ఘటనలో ప్రమాదావ శత్తు తీవ్రంగా గాయపడి మృతి చెందిన పొన్నాల సురేంద్ర మాదిగ.
దామోదర్ మాదిగ మహేష్ మాదిగ మరియు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడిలో భాగంగా పోలీస్ లాఠీ చార్జీలో గాయపడి మృతి చెందిన భారతి మాదిగ గారి చిత్రపటాలకు శనివారపద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు కోదాడ పట్టణం రంగా థియేటర్ చౌరస్తాలో MRPS, MSP ఆధ్వర్యంలో అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
MSP జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ ,
MSP రాష్ట్ర నాయకులు యలమర్తి రాము మాదిగ,
MSP రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు మాదిగ లు పాల్గొని మాట్లాడుతూ
ఎస్సీలను ఏబిసిడిలు గా వర్గీకరించాలని తెలిపారు అమరుల ఆశయ సాధనకై తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సామాజిక వెనుకబాటుతనం జనాభా నిష్పత్తి ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే SC వర్గీకరణ ప్రక్రియను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని వచ్చే అసెంబ్లీ సమావేశాలలో చట్టం చేసి వెంటనే రాష్ట్రంలో అమలు చేయాలని తెలిపారు SC వర్గీకరణ సాధనే అమరులకు ఇచ్చే నిజమైన ఘన నివాళి అమరులను ఆదర్శంగా తీసుకొని యావత్ మాదిగ జాతి ముందుకు కొనసాగాలని MRPS జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కంభంపాటి శ్రీనివాస్, కర్ల కాంతారావు, గంధం పాండు, గంధం యాదగిరి, చీమ శ్రీనివాసుఏపూరి సత్యరాజు మాదిగ,నెమ్మాది అబ్రహం, చెడపంగు రాజా, అమరబోయిన కనకారావు, కలకొండ కరుణాకర్ , మీసాల చరణ్, ఏపూరి శ్రీను, మాడుగుల రాహుల్, ముదిగొండ నాగేష్, తడికమల్ల వీరబాబు, కరిష రఘు, ములకలపల్లి మల్లేష్, కుడుముల వెంకట్, గండు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు