Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Schools reopening: బడిగంట మోగిన వేళ

–రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభం
–అక్కడక్కడ మొదటిరోజే పంతుల ఆలస్యం
–ఫిట్నెస్ లేని పాఠశాల బస్సులపై విస్తృత తనిఖీలు

Schools reopening: ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలంగా ణలో బడి గంట మోగింది. దాదాపు 50 రోజుల వేసవి సెలవుల అనంత రం రాష్ట్రంలో గురువారం పాఠశా లలు పునఃప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మొదటి రోజే విద్యార్థులు ఆసక్తిగా పాఠశాలకు వచ్చారు. మొదటి రోజే విద్యార్థులకు పలు ప్రభుత్వ పాఠశా లలో పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్, రెండు జతల దుస్తులు, పంపిణీ చే శారు. ప్రభుత్వ పాఠశాలలో అధిం చే సదుపాయాలను విద్యార్థులు స ద్వినియోగం చేసుకోవాలని ప్రధానో పాధ్యాయులు కోరారు. పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే చాలా ప్రాంతాల్లో ఉపాధ్యాయులు స మయ పాలన పాటించలేదు. నాగ ర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియో జకవర్గంలో లింగాల, అచ్చంపేట, అమ్రాబాద్, పదర ఏజెన్సీ ప్రాంతా ల్లో టీచర్లు పాఠ శాలలకు ఆలస్యం గా నెమ్మదిగా చేరుకున్నారు.

అలంపూర్ నియోజకవర్గంలో మొ దటి రోజు పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులు హాజరైన దాఖలాలు కనిపించలేదు. ఉపా ధ్యాయులూ డుమ్మా కొట్టారు. అం గన్వాడీ కేంద్రాల్లో కూడా అదే పరి స్థితి ఏర్పడింది. ఎక్కడ కూడా వి ద్యార్థులు రాకపోవడంతో పాఠశాల గదులు బోసిపోయాయి. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై ర వాణా శాఖ అధికారులు కొరడా ఝళిపి స్తున్నారు. పాఠశాలలు తి రిగి ప్రారంభమైన నేపథ్యంలో వి ద్యాసంస్థల బస్సులపై తనిఖీలు చే పట్టారు. ఇందులో భాగంగా ఫిట్నెస్ లేని, పన్నులు చెల్లించని 17 బస్సు లపై కేసు నమోదు చేశారు. అధికా రులు బృందాలుగా తనిఖీలు చేప ట్టారు.

బాలికల పాఠశాలకు తాళం పడింది. జనగామ జిల్లా చేర్యాల మండలం లోని ఆకునూరు గ్రా మంలోనూ పాఠశాల అభివృద్ధి కో సం చేసిన పనులకు బిల్లులు రాలే దని కాంట్రాక్టర్ బడికి తాళం వేశా రు.