–చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి సమాజ నిర్మాణంలో భా గస్వాములవ్వాలి
–రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Role Model : ప్రజా దీవెన, హైదరాబాద్: మారు తున్న కాలానికి, పరిస్థితులకు అను గుణంగా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దే శించుకుని ఉన్నత స్థానానికి ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
మంగళవారం బేగంపేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ లో బీసీ గురుకు లా లు, హాస్టల్స్ లో పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతి థిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంచి ప్రతి భ కనబరిచిన విద్యార్థులకు అభి నందనలు, శుభాకాంక్షలు తెలిపా రు. 593 మార్కులు తెచ్చుకున్న దుర్గాభవాని,590 మార్కులు తె చ్చుకున్న శివాని,580 కి పైగా మా ర్కులు తెచ్చుకున్న 31 మంది ,57 0 పైన మార్కులు తెచ్చుకున్న 216 మంది విద్యార్థులు,వారి తల్లిదం డ్రులకు వారి ప్రాంతానికి రాష్ట్రానికి పేరు తెచ్చారని అభినందించారు. బీసీ గురుకుల పాఠశాలలు ,హాస్టల్ లో లక్షలాది మంది విద్యార్థులు చ దువుతున్నారని మంచి బోధన అం దిస్తున్నఅధ్యాపకవర్గానికి అభినం దనలు తెలిపారు.
పదవ తరగతి పరీక్షల్లో 17 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే వందల్లోనే 570 కి పైగా మార్కులు వచ్చాయని అన్నారు.మరింత మం ది విద్యార్థులకు మార్కులు వచ్చే లా మీ కృషి పెరగాలన్నారు. ప్రోత్సా హం మీ సమస్యలు పై పరిష్కారం ప్రభుత్వం ఎప్ప టికపుడు పూర్తి చే స్తుందన్నారు. మీ దగ్గర నుండి మం చి ఫలితాలు రావాలని,విద్యార్థులు పాస్ మాత్రమే కాకుండా మంచి ర్యాంకులు వచ్చేలా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. ఉపాధ్యా యులకు రావలసిన బెనిఫిట్స్ సంస్థ తరుపున ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు ఇస్తున్నామని తెలిపారు.
ఈ అకాడమీ నుండి 140 స్కూల్ లలో 100 శాతం ఉత్తీర్ణత శాతం ఉందని,మిగిలిన స్కూల్ లో ఎందు కు తక్కువ వచ్చిందని రివ్యూ చే యాలన్నారు.సంవత్సరంలో 300 రోజులు పిల్లలు ఉపాధ్యాయుల వద్దనే ఉంటారని,వారు పేరెంట్స్ కంటే ఎక్కువ గురుకులాల్లోనే మీ దగ్గర దగ్గరే ఉంటారని,వాళ్లలో మం చి చదువు నైపుణ్యాలు అందించా లని అన్నారు. ట్రెక్కింగ్ , సెయిలింగ్ పోటీలకు కూడా వారికి నైపుణ్యా లు అందిస్తున్నామని,చెడు ప్రభావ మునకు లోను కాకుండా భవిష్యత్తు ను లక్ష్యంగా ఎంచుకొని మారుతు న్న కాలానికి, పరిస్థితులకు అనుగు ణంగా పోటీ ప్రపంచంలో నెగ్గి ఉన్న త స్థానాలకు ఎదగాలన్నారు.
గతంలో చదువుకోవడానికి వసతు లు లేవని మారుతున్న కాలానికి అ నుగుణంగా తిండి లేకున్న మంచి చదువు అందించాలని తల్లిదండ్రు లు కోరుకుంటున్నారని అన్నారు.
మీరంతా పోటీ ప్రపంచంలో నెగ్గేలా విధానపరమైన మార్పులను అవగ తం చేసుకోవాలన్నారు.ప్రభుత్వం పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి మంచి పౌష్టిక ఆహారం అందించ డా నికి 40 శాతం మెస్ చార్జీలు పెం చాం. 200 శాతం కాస్మొటిక్ చార్జీ లు ప్రభుత్వం పెంచిందని అన్నా రు.మీ దగ్గర నుండి రైసింగ్ తెలం గాణ లో భాగస్వామ్యం కావాలి. రేపటి తెలంగాణ భవిష్యత్తు కి మీ రు మార్గదర్శకులుగా కావాలి
మన పిల్లలు దేశ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే స్థాయికి ఎదగాల ని, స్టడీస్ , ఆటలు , ఇతర నైపు ణ్యాల్లో మంచి ప్రతిభ కనబరచా లని భవిషత్ లో మనం ఏం కావా లని అనుకుంటున్నామో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆదిశగా ముం దుకు పోవాలివిద్యా కే పరిమితం కాకుండా సామాజికంగా అన్ని రం గాల్లో ముందుడాలి గురుకులాల్లో ట్రెయిన్డ్ టీచర్స్ మంచి పరీక్షలు రాసి ఉద్యోగంలో వచ్చిన వారు ఉన్నారు, ఏ గురుకులాల్లో కూడా ఖాళీ స్థానాలు ఉండకూడదన్నారు .
అన్ని స్కూల్ లు 100 సీట్లు నిం డాలని,అన్ని గురుకులాలు పోటీ పడి మాకు అందులోనే సీటు రా వాలని విధంగా ఎదగాలని, చదు వు కుటుంబాన్ని భవిష్యత్తును మా రుస్తుందని,పిల్లల ఉజ్వల భవిష్య త్తు నిర్మాణం కావాలంటే వారి చదు వుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల ని, చదువే అన్ని సమస్యలకు పరి ష్కారం అని తెలిపారు.ప్రభుత్వం ప్ర తి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రా రంభించనున్నదని ఇప్పటికే 58 స్కూల్ లు సంక్షన్ అయ్యాయని
తెలిపారు.593 మార్కులు తెచ్చు కున్న దుర్గాభవాని ,590 మార్కులు తెచ్చుకున్న శివాని లకు ఇతర వి ద్యార్థులకు అభినందనలు శుభా కాంక్షలు తెలిపారు.
జ్యోతి బాపులే సినిమాను అన్ని గు రుకులాల్లో చూపెడతాం.. తల్లిదం డ్రులతో సహా చూపెడతామని అ న్నారు.మహిళలు ఇంత గౌరవంగా చదువుకుంటున్నారంటే ఆనాడు సావిత్రి భాయ్ పూలే ఆదర్శాలు నేటికి ఈ ఫలాలే అన్నారు.చదువు ఒక్కరి సొత్తు కూడా అది అందరి సొత్తు, జ్యోతిరావు పూలే ఆదర్శం గా తీసుకొని ముందుకు పోవాలని సూచించారు.
ఈ సందర్భంగా పదవ తరగతి పరీ క్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు , వారి తల్లిదండ్రులకు అధ్యాపకులకు మంత్రి శాలువా, మెమెంటో, సర్టిఫికెట్ లతో మంత్రి సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ శ్రీధర్,కమిషనర్ బాల మాయాదేవి , గురుకుల సెక్రటరీ సైదులు ,ఎమ్బీసీ ఫైనాన్స్ కార్పొ రేషన్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరి యు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్ల య్య భట్టు, సిఈఓ అలోక్ కుమార్, వసతి గురువాహాల అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు తదిత రులు పాల్గొన్నారు.