Sharmila:వైయస్సార్ కు వైసిపికి సంబంధమే లేదు
— ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల
Sharmila:ప్రజా దీవెన, విజయవాడ: ఆంధ్రప్ర దేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (Jagan Mohan Reddy) ఏపీసీసీ చీఫ్ వైఎ స్ షర్మిలారెడ్డి (Sharmila)మరోసారి బాణం ఎక్కుపెట్టారు. అన్న జగన్పై (jagan)షర్మిల (sharmila)విమర్శల వర్షం కురిపించారు. వైసీ పీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ మాత్రమే అని రాజశేఖర్ రెడ్డికి వైసీపీ జగన్కు ఎటువంటి సంబం ధం లేదని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ బీజేపీకి (BJP)తొత్తులుగా పని చేశారని విమర్శించారు. బీజేపీ కి వైసీపీ తోక పార్టీ అంటూ వ్యాఖ్య లు చేశారు.రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి రోజున జగన్ ఏమి చేశా రని ప్రశ్నించారు.
ఇడుపులపాయ లో కూడా ఐదు నిముషాలు మాత్ర మే ఉన్నారన్నారు. సొంత తండ్రికి జయంతి సభ ఎలా చేయాలని అడి గారు. సిద్ధం సభకు కోట్ల రూపాయ లు ఖర్చు చేశారని కనీసం రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy)జయంతి రోజు వైసీపీ నాయ కులు, కార్యకర్తలు ఏం చేశారని నిలదీశారు. మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు అంటూ ఘాటుగా విమ ర్శలు గుప్పించారు. బీజేపీ వారు లోక్సభ స్పీకర్ పదవికి, మణిపూర్ జరిగిన ఘటనలకు కూడా వైసీపీ వత్తాసు పలికిందన్నారు. వైసీపీపై ఉన్న కోపంతో రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy)విగ్ర హాలు కొందరు ధ్వంసం చేస్తున్నా రన్నారు. వైసీపీ పార్టీకి రాజశేఖర్ రెడ్డికి (Rajasekhar Reddy)ఎటువంటి సంబంధం లేదని షర్మిల మరోసారి స్పష్టం చేశారు.