Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Shocking Incident: అమానుషం, హన్మకొండలో అమానవీయ సంఘటన

Shocking Incident:ప్రజా దీవెన, హనుమకొండ: సమా జంలో రోజురోజుకు అమానవీయ సంఘటనలు శృతిమించి పోతు న్నాయి. ఇంతకు ముందు దేశంలో ఎక్కడో అక్కడ సమాజం చీదరిం చుకునే ఘటనలు మన కళ్ళముం దు కదలాడినప్పటికీ ఇటీవల కా లంలో తెలుగు రాష్ట్రాల్లో మితి మీ రిపోతున్నాయి. తాజాగా హన్మకొం డ జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకోవడం సంచల నం సృష్టించిoది. ఓ మహిళను వివ స్త్రను చేసి చిత్రవధ చేసిన ఘటన వె లుగు చూసింది. ధర్మసాగర్ మండ లం తాటికాయలలో ఈ దారుణం చోటుచేసుకోవడం స్థానికంగా కలక లం సృష్టించిoది.

వివాహేతర సంబంధం పెట్టుకుం దని ఓ మహిళను ఇనుప గ్రిల్స్ క ట్టి, వివస్త్రను చేసి జ ననాంగాలపై జీడి పోసి చిత్రవధకు గురిచేశారు. తప్పుచేశామని క్షమించాలని వేడు కున్నా కూడా వినకుండా దాడి చేశా రు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు విచార ణ చేపట్టారు.తాటికాయల గ్రామాని కి చెందిన యువతితో మునుగు మండలం బోలోలుపల్లికి చెందిన రాజుకు పదేళ్ల క్రితం వివాహం జరి గింది. వీరికి ముగ్గురు సంతానం కాగా ఇటీవల కాలంలో రాజు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

పదిరోజుల క్రితం ఇద్దరు కలిసి గ్రా మం నుంచి పారిపోయారు. వీరి ద్ద రి కోసం గాలించిన రాజు కుటుం బ సభ్యులు ఎట్టకేలకు వారిని వెతికి పట్టుకుని తాటికాయల గ్రామానికి తీసుకొచ్చారు. ఆపై మహిళ పట్ల అ త్యంత కిరాతకంగా వ్యవహరించా రు. ఆమెను ఇనుపగ్రిల్స్‌కు కట్టి వివ స్త్రను చేసి జననాంగాలపై జీడి పోసి దారుణంగా చిత్రవధచేశారు. ఆత ర్వాత ఇద్దరికీ గుండు గీయించా రు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన కొంత ఆలస్యంగా నేడు వె లుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘ టన అనంతరం రాజు, మహిళ కని పించకుండా పోయారు. మహిళపై దాడి దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చే యడంతో అది కాస్తా వైరల్‌గా మా రింది. దీంతో ధర్మసాగర్ పోలీసులు తాటికాయల గ్రామానికి చేరుకుని దాడిలో పాల్గొన్న కుటుంబసభ్యుల వివరాలను సేకరించారు. మహిళ ను చిత్రహింసలకు గురిచేసిన కు టుంబాన్ని అదుపులోకి తీసుకున్నా రు. అలాగే కనిపించకుండా పోయి న రాజు, మహిళ ఆచూకీ కోసం గా లింపు చర్యలు చేపట్టారు.