SK Nazir:ప్రజా దీవెన ,కోదాడ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా గత రెండు రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల ఆదేశాలు పాటించాలని ముస్లిం మైనారిటీ ఉపాధ్యక్షులు ఎస్ కే నజీర్ (SK Nazir)ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా రైతన్నలు (Farmers)వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లినప్పుడు కరెంటు వేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించి ట్రాన్స్ఫర్లు వేసుకోవాలని కరెంటు పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు పురాతనమైన భవనాలలో ఇళ్లల్లో ఉండవద్దని అధికారులు సూచించిన సురక్షిత ప్రదేశాలలో ఉండాలని తెలిపారు వర్షాల కారణముల గ్రామాలలో నీళ్లు నిలిచి ఉన్నాయని పిల్లలను నీటిలోనికి పంపించవద్దని తల్లిదండ్రులు దగ్గర ఉండి జాగ్రత్తగా దాటించాలని తెలిపారు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి విష జ్వరాలు జలుబు జబ్బులు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య వైద్యాధికారులు (Medical Officers of Health) సిబ్బంది సూచనలు సలహాలు తీసుకొని రోగాలకు దూరంగా ఉండాలని మనవి చేశారు