Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sharat Chandra Pawar: మిర్యాలగూడలో కార్డెన్ అండ్ సెర్చ్

–సరియైన పత్రాలు లేని 118 వా హనాలు,220 లీటర్ల అక్రమ మ ద్యం సీజ్
— నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

SP Sharat Chandra Pawar: ప్రజా దీవెన మిర్యాలగూడ: నల్ల గొండ జిల్లా మిర్యాలగూడ 2 టౌన్ పరిధిలో గల ప్రకాశ్ నగర్ కాలనిలో గురువారం తెల్లవారు జామున జి ల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎ స్ ఆదేశాలతో డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఐదుగురు సీఐ లు 20 యస్.ఐలు మొత్తం కలిపి 280 మంది పోలీస్ సిబ్బంది తో పాటు ఒక నార్కోటిక్ డాగ్ తో సో దాలు నిర్వహించారు. సరియైన ప త్రాలు లేని 98 టు వీలర్ వాహనా లు,16 ఆటోలు,3 కార్లు,1 ఇసుక ట్రాక్టర్,220 లీటర్ల మధ్యం సీజ్ చే సి ముగ్గురు రౌడీ షీటర్స్, ఇద్దరు అ నుమానితుల్ని అదుపులోకి తీసు కోవడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలి పారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లా డుతూ జిల్లాలో శాంతి భద్రతల పరి రక్షణలో భాగంగా అసాంఘిక కార్య కలాపాల కట్టడి కొరకు పట్టణంలో కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని ని ర్వహించామని తెలిపారు. కాలనీ ల్లో,ఇంటి ప్రదేశాల్లో అనుమానితం గా ఎవరైనా కనబడితే వెంటనే స్థా నిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇ వ్వాలని కోరారు. కొత్తగా ఇండ్లకు కిరాయిలకు వచ్చే వారి పూర్తి వివ రాలు తెలుసుకున్నాకే ఆద్దెలకు ఇ వ్వాలని సూచించారు.

నేరరహిత పట్టణంగా తీర్చి దిద్దడంతోపాటు ప్రజలకు రక్షణ కల్పించుటకు జిల్లా పోలీసు యంత్రాంగం పని చేస్తుంద ని, కాలనిలో ఏలాంటి సమస్యలు ఉన్న తెలియజేయాలని అన్నారు. ముఖ్యంగా నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు ఎంతో ముఖ్యం అని వాటిని ఏర్పాటు చేసుకోవాల ని అన్నారు.జిల్లాలో గంజాయి తది తర మాదకద్రవాలను నిలువరించ డం కోసం కృషీ చేస్తున్నామని తెలి పారు. గంజాయి సేవించిన కొంత మంది అనుమానితులకి టెస్టులు నిర్వహించడం జరిగిందని వీరిలో ఒక్కరికి కూడా పాజిటివ్ రాకపోవ డం సంతోషకరమైన విషయం అని అన్నారు.ఎక్కడైన గంజాయి సేవి స్తున్నట్లు,విక్రయించినట్లు, కానీ రవాణా చేస్తున్నట్లు కానీ తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారి వివరా లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, నేర నియంత్రణకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహి స్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖ ర్ రాజు, సీఐలు సోమ నర్సయ్య, పి.యం.డి ప్రసాద్, మోతిరం, జనా ర్ధన్ గౌడ్ శ్రీను నాయక్, కరుణాకర్ ఎస్ఐలు మరియు సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.