SP Sharat Chandra Pawar: ప్రజా దీవెన దేవరకొండ: దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని నేరేడుగొ మ్ము పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాలు,స్థితిగతులు గురించి యస్.ఐ ను అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్,స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.
దొంగతనాలు జరగకుండా పగలు,రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ లు చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పాత నేరస్థుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం,అక్రమ ఇసుక,పి.డి.యస్ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోని నియంత్రించాలని అన్నారు. ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉంటూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పని చేయాలని తెలియజేశారు.
అనంతరం పర్యాటక ప్రాంతమైన వైజాగ్ కాలనీ సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించి అక్కడ జీవనోపాధి కొరకు వచ్చిన ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నిత్యం సుదూర ప్రాంతాల నుండి అనేక సందర్శకులు ఇక్కడికి వస్తుంటారని ఇటీవల కొంత మంది వ్యక్తులు ఇక్కడ నీటి యొక్క లోతు అంచనా వేయలేక ఈతరాక ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని అన్నారు.అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.బోట్లు నడిపే నిర్వహుకులు పరిసర ప్రాంతాలలో గజ ఈతగాళ్ళు, లైఫ్ జాకెట్స్ లాంటి తగిన ప్రమాణాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.ఎవరైనా మద్యం సేవించి ఒక ప్రాంత నుంచి వేరొక ప్రాంతానికి బోట్లలో ప్రయాణిస్తే అక్కడే నిరాకరించాలని,సెక్యూరిటీ సిబ్బంది లాంటి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.ఇక్కడికి వచ్చే సందర్శకులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాల నివారణకు ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ సబ్ డివిజన్ ఏ.ఎస్.పి మౌనిక ఐపీఎస్, దేవరకొండ ఆర్.డి.ఓ రమణా రెడ్డి,డిండి సిఐ బీసన్న, ఎస్బి సీఐ రాము,MRO ఉమాదేవి,నేరేడుకొమ్ము ఎస్.ఐ కొటేష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది వైజాగ్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.