Speaker Prasad : ప్రజా దీవెన, హైదరాబాద్ : ఉభయ సభలు సజావుగా జరగడానికి అం దరూ సహకరించాలని, ముఖ్యంగా మీడియా ప్రతినిధులు ఇందులో కీ లక పాత్ర పోషించాలని అసెంబ్లీ స్పీ కర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
తెలంగాణ లేజిస్లేటివ్ మీడియా అ డ్వైజరీ నూతన కమిటీ మొదటి స మావేశం బుధవారం శాసనసభ భ వనంలోని కమిటీ హాల్ లో జరిగిం ది. ఈ సమావేశంలో శాసన సభా పతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, శాస నమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, లేజి స్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు, కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీని వాస్ రెడ్డి, కో చైర్మన్ పరిపూర్ణా చా రి మరియు సభ్యులు ఈ పాల్గొ న్నారు.
ముందుగా కమిటీ చైర్మన్, కో చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు పుష గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తె లిపిన స్పీకర్, చైర్మన్, మంత్రి, సెక్రట రీ. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడారు.
తెలంగాణ లేజిస్లేటివ్ మీడియా అ డ్వైజరీ నూతన కమిటీ చైర్మన్ ఐ రెడ్డి శ్రీనివాస రెడ్డి , కో చైర్మన్ పరి పూర్ణాచారి మరియు సభ్యులందరి కీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్ర జాస్వామ్యంలో కీలకమైన శాసన సభ, మండలి గౌరవం, ప్రాధాన్యత లను కాపాడుతూ మీడియా సలహా మండలి ద్వారా మీ వంతుగా సేవ లను అందించడం మంచి అవకాశం అని చెప్పారు. సీనియర్ జర్నలిస్టు లుగా మీరు ఎంతో అనుభవం ఉన్న వారని, ఉభయ సభలు సజావుగా జరగడానికి తమ వంతు సహకారా న్ని ఎల్లప్పుడూ అందించాలని కో రారు. మనందరం కలిసి శాసనస భ, శాసనమండలి సమావేశాలు స జావుగా జరిగి, అర్ధవంతమైన చర్చ ల జరిగే విదంగా చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని అందరి ఉద్యేశం అని వ్యాఖ్యానిం చారు. శాసనసభ సమావేశాల స మయంలోనే కాదు, ఇతర సమ యాలలో కూడా శాసనసభకు సం బంధించిన వార్తలకు తగు ప్రాధాన్య త ఇవ్వాలని మీడియాకు విజ్జ్ఞప్తి చే శారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి మాట్లాడుతూ శాసన సభ , శాసన మండలి సమావేశాలు సజావుగా నడవాలి అంటే మీడి యా పాత్రనే కీలకమని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ ను హుందాగా నడవడానికి అన్ని విధాలుగా సహకారం అందించాల ని, రానున్న రోజుల్లో శాసన సభ , శాసన మండలి ఒకే భవనంలోకి రాబోతున్నాయి కావున కొన్ని చేం జెస్ కూడా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మీడియా క మిటీ సభ్యులకు ఎలాంటి సహా యం కావాలన్న అన్ని వేళలా అండ గా ఉంటామని హామీ ఇచ్చారు.
శాసనసభా వ్యవహారాల శాఖ మం త్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడు తూ శాసనసభ, శాసన మండలి వ్యవహారాలలో మీడియాకు బాధ్య తను కల్పించడానికి, మరింత పాత్ర ను పోషించడానికే మీడియా అడ్వై జరీ కమిటీని నియమించినట్లు తె లిపారు. ఉభయ సభల నిర్వాహణ లో అందరి సహకారాన్ని కోరారు. స మావేశాల సందర్భంగా మీడియా ప్ర తినిధులకు అవసరమైన సౌకర్యా లు, వసతులపై ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తా మని హామీ ఇచ్చారు. ముఖ్యంగా సమావేశాల సందర్భంగా జారీ చేసే పాస్ ల విషయంలో కమిటీ సలహా లు, సూచనలను పరిగణనలోకి తీ సుకోవడం జరుగుతుందని, మంచి వాతావరణంలో సమావేశాలు జరి గే విదంగా అందరం కలిసి పనిచే యాలని విజ్ఞప్తి చేశారు.
కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమావేశాల సంద ర్భంగా కవరేజ్ చేసే మీడియా ప్రతి నిధులందరికి పాస్ లు అందే విధం గా సూచనలను అందిస్తామని స్పష్టం చేశారు. మీడియా ప్రతిని ధు లకు అవసరమయ్యే సౌకర్యాలపై అందరి అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని సూచనలను చేస్తా మని తెలిపారు.