Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Srisailam Project: సొరంగం పనుల పునః ప్రారంభం..!

–ఏకకాలంలో రెండువైపులా తవ్వ కకానికి ప్రయత్నం
–బేరింగ్‌తో పాటు ఇతర పరికరాలు తెప్పించేందుకు చర్యలు
–సబ్‌ కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం తరఫున ఆహ్వానం
–ఈ ఏడాది చివరలో ఔట్‌లెట్‌ నుంచి టన్నెలింగ్‌ కు అవకాశం

Srisailam Project: ప్రజా దీవెన, హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులు పునః ప్రారంభిం చేందుకు ప్రభుత్వం (government) ప్రయత్నాలు ప్రారంభించింది. నిలిచిపోయిన సొరంగం తవ్వకం ప్రక్రియను పరు గులు పెట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కసరత్తు ముమ్మరం చేసింది. శ్రీశైలం ఇన్‌లెట్‌ నుంచి టన్నెల్‌ త వ్వే ప్రక్రియలో సాంకేతిక సమస్య లు తలెత్తుతుండటంతో సొరంగం తవ్వకం పనులు నిలిచిపోయాయి. దీంతో నిర్మాణ సంస్థ జేపీకి సబ్‌ కాంట్రాక్ట్‌గా పని చేస్తున్న రాబిన్స్‌ను ఈ దఫా ఉన్న తస్థాయి సమావేశా నికి పిలవాలని సర్కారు నిర్ణయిం చిన నేపథ్యంలోఇన్‌లెట్‌ వైపు నుం చి సీపేజీలు టన్నెల్‌ తవ్వకానికి ప్ర ధాన అవరోధంగా ఉండగా ఔట్‌ లెట్‌ (out let) వైపు గట్టి రాయి ఉండటం, మాటిమాటికీ బేరింగులు, బిట్లు దెబ్బతింటుండడంతో పనులు ముందుకు కదలడం లేదు. ఈ నేప థ్యంలో టన్నెల్‌ పురోగతిపై ఇటీవలే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) తవ్వకం పనుల్లో పురో గతి లేకుంటే చర్యలు తప్పవని అధి కారులకు వార్నింగ్‌ ఇచ్చారు. అంతే కాకుండా జేపీకి సబ్‌కాంట్రాక్ట్‌గా పని చేస్తున్న రాబిన్స్‌ ప్రతినిధులు కూడా ఈ దఫా జరిగే సమావేశానికి హాజర య్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇక టన్నెల్‌ తవ్వకం (Tunneling) శ్రీశైలం వైపు నుంచి రెండుసార్లు ప్రారంభమై సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన విషయం తెలిసిందే. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌(టీబీఎం) ఒక దఫా 8 నిమిషాలపాటు, మరో దఫా రెండు నిమిషాలపాటు పనిచే సి ఆగింది. ఇన్‌లెట్‌ వైపు నుంచి సీ పేజీలు వెలువడటంతో కట్టడి చేసేం దుకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (BSI) సహకారంతో ఇప్పటికే పనులు చేపట్టారు. దీంతో సీపేజీ గణనీయంగా తగ్గింది. ఔట్‌లెట్‌ మన్నెవారిపల్లి, అచ్చంపేట వైపు ఉన్న టీబీఎంలో బేరింగులు పాడై పోవడంతో కొత్త బేరింగులతో పాటు ఇతర పరికరాలు తెప్పించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఈ పరికరాలన్నీ ఆగస్టుకల్లా చేరితే వీటిని బిగించి ఏడాది చివరాంతం లో ఔట్‌లెట్‌ వైపు నుంచి టన్నెల్‌ తవ్వకం చేపట్టే అవకాశాలను పరి శీలిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ (SLBC Tunnel)పనులను అత్యంత ప్రాధాన్య జాబితాలో చేర్చిన విషయం తెలి సిందే. టన్నెల్‌ తవ్వకానికి గల అవరోధాలపై అధ్యయనం చేయడా నికి ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ సిఫారసులతో ఇప్పటికే రూ.50 కోట్లను వెనువెంటనే విడు దల చేశారు. ప్రాజెక్టు నిర్మాణ అంచ నాలను రూ.3150 కోట్ల నుంచి రూ.4468 కోట్లకు సవరించాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేర డంతో త్వరలోనే దీనికి ఆమోదము ద్ర పడే అవకాశాలున్నాయి. ఇన్‌ లెట్‌లో సత్వరం తవ్వకాలు ప్రారం భించాలని, నవంబరులో ఔట్‌లెట్‌ వైపు నుంచి ప్రారంభించి. రెండు వైపులా ఏకకాలంలో తవ్వకం కొన సాగించాలని నిర్ణయించారు. రెండు వైపులా టన్నెల్‌ తవ్వకం ప్రారం భిస్తే నెలకు 300 మీటర్ల చొప్పున 33 నెలల్లో టన్నెల్‌ పూర్తి చేయగలమని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి సంకే తాలిచ్చినట్లు సమాచారం.