Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Srisailam project: పరవశింపజేసిన మత్స్యకారులు

–శ్రీశైలం ప్రాజెక్టు దిగువన చిన్న పడవలతో సందడి చేసిన వైనం
–మంత్రముగ్ధులైన శ్రీశైలం యాత్రి కులు

Srisailam project: ప్రజా దీవెన, నంద్యాల: శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) జలాశయం గేట్లన్నీ మూసి వేయడంతో ఒక్కసారిగా మత్స్యకా రులు చేపలు పట్టేందుకు పడవల తో ప్రాజెక్టు (Srisailam project)లోపలికి రావ టంతో సందర్శకులు ఆహ్లాదకరంగా చూడ టం కనిపించింది. మత్స్యకా రులు చిన్న చిన్న పడవలు వేసుకొని నది పై గుంపులు గుంపులుగా చేపల వేటకు వస్తున్న వారిని చూసి యా త్రికులు మంత్రముగ్ధులవుతు న్నా రు. గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహంరావడంతో జలా శయం గేట్లు ఎత్తి నీటిని కిందకి వది లిన అధికారులు జూరాల నారాయణపూర్ నుంచి వరద ప్రవాహం (flood flow) ఆగి పోవడంతో సోమవారం రాత్రికి గేట్ల న్నీ పూర్తిగా బంద్ చేశారు.గతంలో ప్రవాహం అధికంగా ఉండటంతో చేపల వేటకు వెళ్ళవద్దని అధికారు లు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తు తం గేట్లన్నీ మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు బయ లుదేరిన మత్స్యకారులు. గుంపు లు గుంపులుగా పడవల్లో మత్స్య కారులు బయలుదేరి చేపలు భారీ గా పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సందర్శకులు ఈ దృ శ్యాన్ని చూసి పరవశించి పోతు న్నారు.