Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

State Governor Jishnu Dev Verma: ఆరోగ్య జీవనశైలిని అలవర్చుకోoడి

–ఆరోగ్యవంతమైన జీవనం గడిపేం దుకు ప్రయత్నించండి
–నిత్యజీవితంలో యోగా ప్రాధాన్య తను ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గమనించాలి
–అంతర్జాతీయ యోగా దినోత్సవం లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

State Governor Jishnu Dev Verma: ప్రజా దీవెన, హైదరాబాద్: సమాజంలో ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు అనారోగ్యం బారిన పడకుండా ముందు జాగ్ర త్తగా ఆరోగ్య జీవనశైలిని అలవ ర్చుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. శనివార11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలిలోని బాల యోగి స్టేడియంలో ఆరోగ్యం కు టుంబ సంక్షేమ మరియు ఆయుష్ శాఖ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర మంత్రులు దామో దర్ రాజ నర్సింహ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృ ష్ణారావు లతో కలిసి ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడు తూ యోగాకు నిత్యజీవితంలో ఉ న్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గమ నించాలని, ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర చడంలో అద్భుతమైన సాధన యో గా అని అన్నారు. యోగా అనేది శరీర వ్యాయమమే కాకుండా జీవన విధానంలో భాగమని, ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా యోగా చేసి త మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆ నందంగా ఉండాలని గవర్నర్ అ న్నారు.

రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లా డుతూ యోగా ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన బహుమతి అని, యో గా కేవలం వ్యాయామం కాదు, ఇది శరీరం, మనస్సు మరియు ఆత్మను ఏకం చేస్తుందని, ఆరోగ్య సమస్య లకు ఇది ఉత్తమ పరిష్కారమని అ న్నారు. యోగా చేయడానికి దృఢ సంకల్పం మరియు మంచి గురువు అవసరమని, యోగ సాధన ద్వారా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకో వడం తోపాటు ప్రతి ఒక్కరు దినచ ర్యలో భాగంగా యోగాను అలవా టు చేసుకోవాలని అన్నారు. వి ద్యా ర్థులలో యోగాభ్యాసం ద్వారా ఒత్తి డిని నివారిస్తుందని ఏకాగ్రతను పెం పొందిస్తుందని, ప్రతి పాఠశాలలో యోగా తరగతులు నిర్వహించాల ని ఈ యోగ సాధన ద్వారా విద్యా ర్థులకు మానసిక స్పష్టత, శారీరక బలం మరియు ఏకాగ్రతను బలో పేతం చేయడానికి సహాయపడు తుందని ఆయన అన్నారు.
యోగ ధ్యానం అనేది ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడు సాధన మని ప్రపంచ సమాజానికి యోగా అనే గొప్ప వరాన్ని అందించిన మ హర్షి పతాంజలి చిరస్మరణీయుల ను అన్నారు.

క్రీడలు మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు యోగాను పరిచ యం చేసిన గడ్డ మన దేశమని, యోగాను అన్ని దేశాలకు చాటి చె ప్పి వైద్యులకు పని లేకుండా ఆరో గ్యవంతులను కాపాడే సాధనమని అన్నారు. ప్రతిరోజు యోగ చేయ డం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు చురుకుగా పని చేస్తారని, అ దేవిధంగా యోగ ఎలాంటి వ్యాధుల నైన నయం చేసే సాధనమని అ న్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు మాట్లాడుతూ నేడు అం తర్జాతీయ యోగా దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత అలవర్చుకోవా లని అన్నారు. జబ్బు వస్తే ఎంతో ఖర్చు పెడతారని దానికి ముందే ఆరోగ్యంగా ఉండడానికి యోగా లాంటి అలవాట్లను పాటించినట్ల యితే అందరూ ఆరోగ్యంగా ఉంటా రని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏవి ఎన్ రెడ్డి, ఆరోగ్యశాఖ సెక్రటరీ క్రిస్టి నాజో చొంగత్, స్పోర్ట్స్ చైర్మన్ శివ సేనారెడ్డి, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ మేయ ర్ శ్రీలత శోభన్ రెడ్డి జిహెచ్ఎంసి క మిషనర్ ఆర్. వి. కర్ణన్, యువతి యువకులు, విద్యార్థినీ విద్యార్థు లు, తదితరులు పాల్గొన్నారు.