Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Government Schools Strengthening : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం

_ పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ యాదవ్

Government Schools Strengthening : ప్రజా దీవెన, దేవరకద్ర: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే పి ఆర్ టి యు టి ఎస్ ప్రధాన లక్ష్యం గా పని చేస్తుందని ఆ యూనియన్ జిల్లా అ ధ్యక్షులు జి.మదన్ మోహన్ యాద వ్ అన్నారు. పి ఆర్ టి యు టి ఎస్ దేవరకద్ర మండల శాఖ అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్ ల ఆధ్వర్యంలో సోమవారం దేవరక ద్ర బాలుర ఉన్నత పాఠశాలలో సో మవారం నిర్వహించిన పదవ తరగ తిలో అత్యధిక మార్కులు సాధించిన ప్ర తిభావంతుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ల్లో చదువుతున్న పేద విద్యార్థుల ఉన్నతికి పి ఆర్ టి యు టి ఎస్ సంపూర్ణ సహకారం అందిస్తుందని అన్నారు. విద్యార్థులు సర్వతోము ఖాభివృద్ధికి ఉపాధ్యాయులు విశేష కృషి చేస్తున్నారని అన్నారు.

పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా ప్రధాన కార్య దర్శి జి.సుధాకర్ రెడ్డి మాట్లాడు తూ విద్యా, ఉపాధ్యాయ సమస్య ల సత్వ ర పరిష్కారమే లక్ష్యంగా పి ఆర్ టి యు టి ఎస్ పనిచేస్తుందని అన్నా రు. ప్రభుత్వ పాఠశాలల్లో చ దువు తున్న ప్రతిభావంతులైన వి ద్యార్థు లను పి ఆర్ టి యు టి ఎస్ ప్రో త్సహిస్తుందని అన్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబ ర్చిన పదవ తరగతి విద్యార్థులను గుర్తించి ప్రోత్సా హకాలు ప్రదానం చేయడం అభి నందనీయమన్నా రు. మండల విద్యాధికారి బలరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యా ప్రమాణాలను పెంచేందు కు ఉపాధ్యాయులు నిరంతరం కృ షి చేయాలని కోరారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను పెం చాలని కోరారు.ఈ నెల 6 నుంచి జరిగే బడి బాటను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలన్నారు. జిల్లా అధ్యక్షులు వి.బుచ్చారెడ్డి మాట్లా డుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థుల విద్యాభివృద్ధికి పి ఆర్ టి యు సహకారం అందిస్తుందని అన్నారు.

అనంతరం మండలంలోని ప్రభు త్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పి.ఆర్.టి .యు .టి ఎస్ దేవరకద్ర మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అశ్విని చంద్రశేఖర్, డి.కవిత, సురేష్ రెడ్డి, దేవరకద్ర, కౌ కుంట్ల, మహబూబ్ రూరల్ బాధ్యులు రఘువర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, పూరెందర్ రెడ్డి, గడ్డం అంజయ్య, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ , వివిధ పాఠశాలల హెచ్ యం లు రామ లింగం, రమేష్ , కె కె శ్రీనివాస్, జాఫర్ , అబ్దుల్ సలాం, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.